AMD: సెమీ కండక్టర్స్, చిప్స్ కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ పొరుగుదేశం చైనాపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే మారుతున్న పరిస్థితులు, ఇండియాలో పెట్టుబడి అవకాశాల మెరుగుదల వల్ల పలు కంపెనీలు భారత్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల్లోని ప్రముఖ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
అమెరికాకు చెందిన చిప్మేకర్ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ (AMD) ఇండియాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో 400 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. గాంధీనగర్లో జరిగిన సెమికాన్ ఇండియా 2023 రెండవ ఎడిషన్ వేదికగా AMD గ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్మాస్టర్ ఈ విషయాన్ని ప్రకటించారు.

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేయనున్నట్లు AMD తెలిపింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీకి చెందిన అతిపెద్ద డిజైన్ సెంటర్గా ఇది పనిచేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా 2028 చివరి నాటికి దాదాపు 3 వేల కొత్త ఇంజనీరింగ్ జాబ్స్ క్రియేట్ చేయనున్నట్లు వెల్లడించింది.
2001లో AMD తన మొదటి సైట్ను న్యూఢిల్లీలో నెలకొల్పి భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. అందులో ప్రస్తుతం 6 వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ముంబై సహా 9 ప్రాంతాల్లో సంస్థ విస్తరించి ఉంది. దేశంలో AMD అతిపెద్ద R&D డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని ఎలక్ట్రానిక్స్ & IT శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications