Mukesh Ambani: రఫ్రాడిస్తున్న ముఖేష్-ఆకాష్ అంబానీలు.. రికార్డులతో చైనా కంపెనీలు షాక్..!

Reliance Jio: ప్రస్తుతం రిలయన్ జియో దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. వాస్తవానికి జూన్ 2022లో రిలయన్స్ జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేష్ అంబానీ తప్పుకుని తన కుమారుడు ఆకాష్ అంబానీని చైర్మన్‌గా చేశారు. అలాగే చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్ ఫారమ్ చైర్మన్‌గా నియమించారు.

ఆకాష్ అంబానీ టెలికాం రంగంలో తన తండ్రి స్థాపించిన జియో సంస్థను కొత్త శిఖరాలకు చేర్చి రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. దేశంలో ప్రజలకు అత్యంత ప్రియమైన ఆపరేటర్‌గా సేవలను అందిస్తోంది. దీంతో రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది. డేటా వినియోగం పరంగా భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియో ప్రపంచంలోనే నంబర్-1 స్థానంలో నిలిచింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ డేటా వినియోగంలో ప్రపంచంలోని చైనా కంపెనీలను అధిగమించింది. ఇదే విషయాన్ని జియో తన తాజా త్రైమాసిక ఫలితాల సమయంలో వెల్లడించింది. త్రైమాసికంలో జియో జియో నెట్‌వర్క్‌లో మొత్తం 4400 కోట్ల జీబీ డేటాను యూజర్లు ఖర్చు చేశారు.

Ambani s telecom venture Reliance Jio stood no1 in world for data usage beating chinese firms

డేటా వినియోగంలో జియో ప్రపంచవ్యాప్తంగా నంబర్-1గా నిలిచింది. ఇది అన్ని ఇతర కంపెనీలను వెనుకకు నెట్టివేసింది. ఈ క్రమంలో జియో పెద్ద చైనా కంపెనీలను కూడా ఓడించి డేటా పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. రిలయన్స్ జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉండగా.. కేవలం గత ఏడాది మాత్రమే 4 కోట్ల మంది జియో సేవలను కొత్తగా తీసుకోవటానికి చేరారు.

డేటా వినియోగంలో అత్యధికంగా ఉన్న గతంలో చైనా కంపెనీల పేరిట ఉండేది. అయితే ప్రస్తుతం జియో కస్టమర్లు ప్రతినెల సగటున 30.3 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. అంటే సగటున రోజుకు ఒక జీబీ కంటే ఎక్కువగానే వినియోగం ఉంది. జూన్ త్రైమాసికంలో జియో డేటా వినియోగం 32.8 శాతం పెరిగి 44 బిలియన్ గిగాబైట్‌లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 33.2 బిలియన్ గిగాబైట్‌లుగా ఉంది. ఇది జియోలో వేగంగా పెరుగుతున్న 5జీ వినియోగదారులకు అద్ధం పడుతోంది.

జియో అనేక ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో అపరిమిత డేటాతో పాటు ఉచిత కాలింగ్ కూడా ఉన్నాయి. దీంతో రిలయన్స్ జియో చాలా త్వరగా దేశ టెలికాం పరిశ్రమలో నంబర్-1గా మారింది. ప్రపంచవ్యాప్తంగా జియోకు 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం జియోకు 13 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారు. డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ.. 5G సేవల విషయంలో చైనా కంటే వెనుకబడి ఉంది. జియో బాధ్యతలను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ నిర్వహిస్తున్నారు. రిలయన్స్ జియోను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+