Reliance Jio: ప్రస్తుతం రిలయన్ జియో దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. వాస్తవానికి జూన్ 2022లో రిలయన్స్ జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేష్ అంబానీ తప్పుకుని తన కుమారుడు ఆకాష్ అంబానీని చైర్మన్గా చేశారు. అలాగే చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్ ఫారమ్ చైర్మన్గా నియమించారు.
ఆకాష్ అంబానీ టెలికాం రంగంలో తన తండ్రి స్థాపించిన జియో సంస్థను కొత్త శిఖరాలకు చేర్చి రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. దేశంలో ప్రజలకు అత్యంత ప్రియమైన ఆపరేటర్గా సేవలను అందిస్తోంది. దీంతో రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది. డేటా వినియోగం పరంగా భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియో ప్రపంచంలోనే నంబర్-1 స్థానంలో నిలిచింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ డేటా వినియోగంలో ప్రపంచంలోని చైనా కంపెనీలను అధిగమించింది. ఇదే విషయాన్ని జియో తన తాజా త్రైమాసిక ఫలితాల సమయంలో వెల్లడించింది. త్రైమాసికంలో జియో జియో నెట్వర్క్లో మొత్తం 4400 కోట్ల జీబీ డేటాను యూజర్లు ఖర్చు చేశారు.

డేటా వినియోగంలో జియో ప్రపంచవ్యాప్తంగా నంబర్-1గా నిలిచింది. ఇది అన్ని ఇతర కంపెనీలను వెనుకకు నెట్టివేసింది. ఈ క్రమంలో జియో పెద్ద చైనా కంపెనీలను కూడా ఓడించి డేటా పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. రిలయన్స్ జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉండగా.. కేవలం గత ఏడాది మాత్రమే 4 కోట్ల మంది జియో సేవలను కొత్తగా తీసుకోవటానికి చేరారు.
డేటా వినియోగంలో అత్యధికంగా ఉన్న గతంలో చైనా కంపెనీల పేరిట ఉండేది. అయితే ప్రస్తుతం జియో కస్టమర్లు ప్రతినెల సగటున 30.3 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. అంటే సగటున రోజుకు ఒక జీబీ కంటే ఎక్కువగానే వినియోగం ఉంది. జూన్ త్రైమాసికంలో జియో డేటా వినియోగం 32.8 శాతం పెరిగి 44 బిలియన్ గిగాబైట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 33.2 బిలియన్ గిగాబైట్లుగా ఉంది. ఇది జియోలో వేగంగా పెరుగుతున్న 5జీ వినియోగదారులకు అద్ధం పడుతోంది.
జియో అనేక ప్లాన్లను ప్రారంభించింది. ఇందులో అపరిమిత డేటాతో పాటు ఉచిత కాలింగ్ కూడా ఉన్నాయి. దీంతో రిలయన్స్ జియో చాలా త్వరగా దేశ టెలికాం పరిశ్రమలో నంబర్-1గా మారింది. ప్రపంచవ్యాప్తంగా జియోకు 49 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం జియోకు 13 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారు. డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ.. 5G సేవల విషయంలో చైనా కంటే వెనుకబడి ఉంది. జియో బాధ్యతలను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ నిర్వహిస్తున్నారు. రిలయన్స్ జియోను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాడు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications