Reliance Retail: దేశంలో అత్యంత సంపన్న వ్యాపార సంస్థల్లో ఒకటి రిలయన్స్ గ్రూప్. అంబానీ నేతృత్వంలో కంపెనీ అనేక కొత్త వ్యాపారాల్లోకి గత కొన్నేళ్లుగా ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంబానీ వారసులు పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ దూకుడు మరింత వేగవంతం అయ్యింది.
ముఖ్యంగా ఇషా అంబానీ చేతిలో పడిన తర్వాత రిలయన్స్ రిటైల్ వ్యాపారం ఊహించని ఎదుగుదలను చూస్తోంది. ఈక్రమంలోనే రిలయన్స్ గ్రూప్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ 150 బిలియన్ డాలర్ల డయాగ్నస్టిక్ హెల్త్ కేర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోందని వెల్లడైంది. ఈ రంగంలో రూ.1,000 నుంచి రూ.3,000 కోట్లను పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఈ వ్యాపారంలో ఉన్న ఏదైనా కంపెనీని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తోంది.

కొత్త కంపెనీని ఏర్పాటు చేయటం కంటే డెడికేటెడ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు ఉత్తమమని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం ముఖేష్ అంబానీకి చెందిన సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉనికిని కలిగి ఉన్న ప్లేయర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ ఆన్లైన్ ఫార్మసీ నెట్మెడ్స్ను కలిగి ఉంది. ఇది థైరోకేర్, హెల్తీయన్స్ వంటి ఇతర సంస్థలతో టై-అప్ల ద్వారా పాథాలజీ సేవలను అందిస్తుంది.
నెట్మెడ్స్ ఇప్పటికే ఇతర సంస్థల సహకారంతో పాథాలజీ సేవలను అందజేస్తుండగా.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ భారతదేశం అంతటా ఫిజికల్ లాబొరేటరీల నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి, విస్తృత శ్రేణి రోగనిర్ధారణ సేవలను అందించడానికి, స్కేలబిలిటీని పెంచడానికి సొంతంగా డయాగ్నస్టిక్ కంపెనీని స్థాపించాలని భావిస్తోంది. దీనికి ముందు 2020లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ట్మెడ్స్లో మెజారిటీ వాటాను రూ.620 కోట్లకు కొనుగోలు చేసింది.
డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగం వృద్ధికి సిద్ధంగా ఉండటంతో దేశంలోని పెద్ద ఆటగాళ్లు ఈ రంగంపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. రేటింగ్ ఏజెన్సీ CRISIL ఏప్రిల్లో విడుదలచేసిన నివేదిక ప్రకారం డయాగ్నోస్టిక్ కంపెనీలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 10-11 శాతం వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అంచనా వేసింది. ప్రధానంగా టైక్-2,3 నగరాల్లో సమగ్ర నివారణ ఆరోగ్య ప్యాకేజీల కోసం పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణంగా కంపెనీ పేర్కొంది. దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యంపై ప్రజలు మళ్లీ దృష్టి సారించడమే నివారణ ఆరోగ్య పరీక్షల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications