Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
Adani Power: దేశంలోని అత్యంత శక్తివంతమైన ఇద్దరు వ్యాపారవేత్తలు ప్రస్తుతం చేతులు కలిపారు. ఏకంగా 20 ఏళ్ల పాటు కలిపి పనిచేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా గౌతమ్ అదానీ-ముఖేష్ అంబానీ విద్యుత్ రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వాస్తవానికి అదానీ గ్రూప్ కంపెనీ- అదానీ పవర్ లిమిటెడ్ 500 మెగావాట్ల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్తో 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం జరిగింది. క్యాప్టివ్ యూజర్స్ పాలసీ ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. ఈ విధానాన్ని ఎలక్ట్రిసిటీ రూల్ 2005 కింద తీసుకొచ్చారు.

స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్(MEL) ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు అదానీ పవర్ తెలిపింది. MEL మొత్తం కార్యాచరణ సామర్థ్యం 2,800 MWగా ఉంది. ఇందులో 600 మెగావాట్ల యూనిట్ను క్యాప్టివ్ యూనిట్గా మార్చాలని ప్రతిపాదించారు. అదానీ పవర్ ప్రకారం క్యాప్టివ్ పాలసీ ప్రయోజనాలను పొందేందుకు, పవర్ ప్లాంట్ మొత్తం సామర్థ్యానికి అనుగుణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాప్టివ్ యూనిట్లో 26 శాతం యాజమాన్య వాటాను కలిగి ఉండాలి. ఇది క్యాప్టివ్ యూనిట్ మొత్తం సామర్థ్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
MEL 5 కోట్ల ఈక్విటీ షేర్ల ద్వారా రిలయన్స్ దీని కోసం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనుందని అదానీ పవర్ తెలిపింది. ఈ డీల్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సంబంధించి అదానీ పవర్, మహాన్ ఎనర్జీన్, రిలయన్స్ ఇండస్ట్రీస్లు పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఇక్కడ అదానీ పవర్ ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)కి పెద్ద ఆర్డర్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1,600 మెగావాట్ల రాయ్గఢ్ ఫేజ్-2 థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది రూ.4,000 కోట్ల ఆర్డర్. BHEL ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ ఫేజ్-2లో హై-టెక్నాలజీ ఆధారిత 2x800 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం పరికరాల సరఫరా, నిర్మాణం, ఆపరేషన్ పర్యవేక్షణ కోసం ఆర్డర్ స్వీకరించబడింది. ఈ రెండు వార్తలతో నేడు అదానీ పవర్ షేర్లు దూకుడు పెంచాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో షేర్ ధర ఏకంగా రూ.527 మార్కును తాకింది.


Click it and Unblock the Notifications