రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ రిలయన్స్లో తనకు ఉన్న షేర్లలో దాదాపు 93.75 శాతం వాటాను తనఖా పెట్టారని వార్తలు వస్తున్నాయి. ప్రసాద్ వద్ద 6,40,000 రిలయన్స్ షేర్లు ఉండగా, ఇందులో 6,00,000 షేర్లను తనఖా పెట్టారని తెలుస్తోంది. ప్రసాద్తో పాటు ఇతరుల అధికారులు కూడా పెద్ద మొత్తంలో షేర్లు తనఖా పెట్టినట్లుగా తెలుస్తోంది.

గతంలో షేర్ల విక్రయం
ప్రసాద్ తనకు చెందిన షేర్లను 29 జూన్ 2020లో తనఖా పెట్టారు. వీటి విలువ రూ.103 కోట్లుగా తెలుస్తోంది. 6,40,000 షేర్లలో ఆరు లక్షలు తనఖా పెట్టగా, ప్రస్తుతం అతని వద్ద 40,000 షేర్లు ఉన్నాయి. షేర్ల తనఖాకు ముందు ప్రసాద్ చివరిసారి 2017 సెప్టెంబర్లో ట్రేడింగ్ చేశారు. ఆ సమయంలో 1,36,666 షేర్లు విక్రయించారు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ లేదా ఫండ్ లేదా ఇతర వెంచర్లకు లేదా అక్వైజేషన్ కోసం నిధులు అవసరమైన సమయంలో తనఖా పెట్టారని తెలుస్తోంది.

35 ఏళ్లుగా ముఖేష్ ఏ-టీంలో..
ప్రసాద్ గత 35 ఏళ్లుగా ముఖేష్ అంబానీ ఏ-టీంలో ఉన్నారు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఫైబర్, పెట్రోకెమికల్స్, పెట్రోలియం బిజినెస్లలో కీలక పదవులు నిర్వర్తించారు. 1980లో రిలయన్స్కు చెందిన హజీరా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను స్ట్రీమ్లోకి తీసుకు వచ్చిన ఘనత దక్కింది. రిలయన్స్ కృషన్ గోదావరి అచీవ్మెంట్లోను ప్రసాద్ పాత్ర ఉంది.

వీరూ తనఖా పెట్టారు
స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అలోక్ అగర్వాల్ 1.44 మిలియన్ల షేర్లు సెప్టెంబర్ 2019లో తనఖా పెట్టారు. ఇందులో 9,40,000 షేర్లను తీసుకున్నారు. గత నెలలో 2,25,000 షేర్లు తనఖాపెట్టారని వార్తలు వస్తున్నాయి. గత నెలలో రైట్స్ ఇష్యూ ద్వారా 100,000కు పైగా షేర్లను దక్కించుకున్నారని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి నుండి దాదాపు 151 రెట్లు ఎగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications