రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ రిలయన్స్లో తనకు ఉన్న షేర్లలో దాదాపు 93.75 శాతం వాటాను తనఖా పెట్టారని వార్తలు వస్తున్నాయి. ప్రసాద్ వద్ద 6,40,000 రిలయన్స్ షేర్లు ఉండగా, ఇందులో 6,00,000 షేర్లను తనఖా పెట్టారని తెలుస్తోంది. ప్రసాద్తో పాటు ఇతరుల అధికారులు కూడా పెద్ద మొత్తంలో షేర్లు తనఖా పెట్టినట్లుగా తెలుస్తోంది.

గతంలో షేర్ల విక్రయం
ప్రసాద్ తనకు చెందిన షేర్లను 29 జూన్ 2020లో తనఖా పెట్టారు. వీటి విలువ రూ.103 కోట్లుగా తెలుస్తోంది. 6,40,000 షేర్లలో ఆరు లక్షలు తనఖా పెట్టగా, ప్రస్తుతం అతని వద్ద 40,000 షేర్లు ఉన్నాయి. షేర్ల తనఖాకు ముందు ప్రసాద్ చివరిసారి 2017 సెప్టెంబర్లో ట్రేడింగ్ చేశారు. ఆ సమయంలో 1,36,666 షేర్లు విక్రయించారు. ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ లేదా ఫండ్ లేదా ఇతర వెంచర్లకు లేదా అక్వైజేషన్ కోసం నిధులు అవసరమైన సమయంలో తనఖా పెట్టారని తెలుస్తోంది.

35 ఏళ్లుగా ముఖేష్ ఏ-టీంలో..
ప్రసాద్ గత 35 ఏళ్లుగా ముఖేష్ అంబానీ ఏ-టీంలో ఉన్నారు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఫైబర్, పెట్రోకెమికల్స్, పెట్రోలియం బిజినెస్లలో కీలక పదవులు నిర్వర్తించారు. 1980లో రిలయన్స్కు చెందిన హజీరా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను స్ట్రీమ్లోకి తీసుకు వచ్చిన ఘనత దక్కింది. రిలయన్స్ కృషన్ గోదావరి అచీవ్మెంట్లోను ప్రసాద్ పాత్ర ఉంది.

వీరూ తనఖా పెట్టారు
స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అలోక్ అగర్వాల్ 1.44 మిలియన్ల షేర్లు సెప్టెంబర్ 2019లో తనఖా పెట్టారు. ఇందులో 9,40,000 షేర్లను తీసుకున్నారు. గత నెలలో 2,25,000 షేర్లు తనఖాపెట్టారని వార్తలు వస్తున్నాయి. గత నెలలో రైట్స్ ఇష్యూ ద్వారా 100,000కు పైగా షేర్లను దక్కించుకున్నారని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి నుండి దాదాపు 151 రెట్లు ఎగిసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications