అమెజాన్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. భారత్ లోని తనకున్న వివిధ వ్యాపారాల్లో 500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నివేదిక ప్రకారం తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మానవ వనరులు, సపోర్ట్ ఫంక్షన్ల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఈ తాజా తొలగింపులు మార్చి 2023లో చేసిన 9,000 ఉద్యోగాల కోత ప్రకటనలో భాగమని అమెజాన్ తెలిపినట్లు తెలుస్తోంది.
మార్చిలో అమెజాన్ తన క్లౌడ్ సేవలు, ప్రకటనలు, ట్విచ్ యూనిట్ల నుంచి మాంద్యం భయాల కారణంగా దాదాపు 9,000 ఉద్యోగాలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కంపెనీ సుమారు 18,000 మంది ఉద్యోగులను తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ గణనీయమైన మొత్తంలో ఉద్యోగుల్ని తీసుకుంది. అయితే అనిశ్చిత ఆర్థిక వ్యవస్థతో ఉద్యోగుల కోత తప్పలేదని కంపెనీ తెలిపింది.

"మేము నివసించే అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ మరియు సమీప భవిష్యత్తులో ఉన్న అనిశ్చితి కారణంగా, మేము మా ఖర్చులు, హెడ్కౌంట్లో మరింత క్రమబద్ధీకరించాలని ఎంచుకున్నాము" అని CEO ఆండీ జాస్సీ ఉద్యోగులకు జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు.
ఏప్రిల్లో Amazon.com Inc. దాని విస్తృత కోతల్లో భాగంగా దాని వీడియో-గేమ్ విభాగాలలో సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, కంపెనీ శాన్ డియాగో స్టూడియోలోని కార్మికులను ప్రభావితం చేసింది.
అమెజాన్ మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఈ కంపెనీలు ఎక్కువగా యూఎస్ తో వివిధ దేశాల్లో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా అమెజాన్ మాత్రం ఇండియాలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. దీంతో భారత్ లో కూడా వివిధ కంపెనీలు ఉద్యోగాలు తొలగిస్తాయన్న భయంతో చాలా మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications