Amazon CEO Andy Jassy: ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు కరోనా కాలంలో తమ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ అందించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోవటంతో కంపెనీలు తిరిగి పాత పద్ధతులకు వెళ్లిపోతున్నాయి. ఇదే క్రమంలో అమెజాన్ అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ఇటీవల అమెజాన్ ఉద్యోగులు కోసం కొన్ని నూతన విధానాలను ప్రకటించారు.
సీఈవో ఆండీ జాస్సీ కంపెనీ నిర్వహణ క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగులను జనవరి నుంచి ఫుల్ టైం కార్యాలయానికి తిరిగి తీసుకురావడానికి రూపొందించబడిన ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ అండ్ క్లౌడ్-కంప్యూటింగ్ కంపెనీల్లో పెద్ద చర్యకు దిగింది. సెప్టెంబర్ 16న కంపెనీ తన ఉద్యోగులకు పంపించిన అంతర్గత మెయిల్ సమాచారం ప్రకారం ఇకపై అమెజాన్ ఉద్యోగులు వారానికి 5 రోజుల పని ప్రదేశానికి హాజరు కావడం తప్పనిసరిచేయబడిందని స్పష్టం చేసింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనలకు గురిచేస్తోంది.

కంపెనీ తీసుకున్న వారానికి 5 రోజులపాటు ఆఫీసులకు రావాలనే నిర్ణయం సంస్థలో కమ్యూనికేషన్, సమర్థతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని సీఈవో పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సంవత్సరాలుగా వినిపిస్తున్న సవాళ్లను సీఈవో జాస్సీ అంగీకరించారు. రోజువారీ ఉద్యోగల జీవితంలో మితిమీరిన చర్చలు, అనవసరమైన సమావేశాలు, అనేక స్థాయిల ఆమోదం సాధారణమైందని మెమోలో పేర్కొన్నారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ లాగా పనిచేయాలనుకుంటున్నామని జాస్సీ తన సందేశంలో స్పష్టంగా వెల్లడించారు. ఇందుకోసం కంపెనీ తప్పనిసరిగా ఆవిష్కరణ, వేగవంతమైన నిర్ణయం తీసుకోవడం, బలమైన సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
పునర్నిర్మాణంలో భాగంగా అమెజాన్లోని ప్రతి ప్రధాన విభాగం మార్చి 2025 నాటికి మేనేజర్లకు వ్యక్తిగత కంట్రిబ్యూటర్ల నిష్పత్తిని 15% పెంచాలి. పురోగతిని మందగించిన రెడ్ టేప్ను తగ్గించడం ద్వారా మరింత సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఉద్యోగులకు సాధికారత కల్పించడం ఈ సర్దుబాటు లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యూరోక్రసీతో పోరాడటానికి అదనపు దశలో, జాస్సీ కొత్త "బ్యూరోక్రసీ టిప్లైన్"ని ప్రవేశపెట్టిందని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది.
ఇక్కడ సీఈవో ప్రకటనలో మరో ప్రధాన అంశం అమెజాన్ కొత్తగా తీసుకొస్తున్న రిటర్న్-టు-ఆఫీస్ పాలసీ. ఇది జనవరి 2024 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయ ఉద్యోగులందరూ వ్యక్తిగతంగా పనికి తిరిగి రావాలని ఆదేశించింది. దీనికి ముందు కంపెనీ కనీసం వారంలో మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాలనే హైబ్రిడ్ విధానాన్ని కంపెనీలోని ఉద్యోగులకు అందించిన సంగతి తెలిసిందే. రిమోట్ వర్క్ కోసం ఇప్పటికే ఆమోదించబడిన పరిస్థితుల కోసం లేదా పాత్రల కోసం ఈ కొత్త పాలసీకి మినహాయింపులు పరిగణించబడతాయని ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications