Amazon WFO: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం చాలా మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఉద్యోగుల నుంచి ఉత్తమ పనితీరు కోరుతూ తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీసు పద్ధతిని ప్రవేశపెడుతోంది.

కంపెనీ నిర్ణయం..
అమెరికా కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న అమెజాన్ తన ఉద్యోగులను పనిచేసేందుకు తిరిగి ఆఫీసులకు పిలిపిస్తోంది. కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రావాలని సూచించారు. మే 1 నుంచి వారానికి మూడు రోజులు తప్పక ఆఫీసుల నుంచి ఉద్యోగులు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందు ఆఫీసులకు ఎవరు రావాలని నిర్ణయించే బాధ్యత కంపెనీలోని వ్యక్తిగత బృందాలకు ఉంది.

వారికి వెసులుబాటు..
కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో సేల్స్, కస్టమర్ సపోర్ట్ వంటి ఉద్యోగులకు మాత్రం వెసులుబాటు ఉంటుందని జాస్సీ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించటం అంత సులువైన పనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయని సీఈవో ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్ లో వెల్లడించారు.

ఉద్యోగులకు అనుమానాలు..
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు అమెజాన్ అనుమతించి దాదాపు 3 ఏళ్లు గడుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుస్తున్న ఈ మార్పు ఎలా అమలు చేయబడుతుందనే దానిపై చాలా మంది ఉద్యోగులకు ప్రశ్నలు, అనుమానాలు ఉంటాయని తనకు తెలుసునని సీఈవో అన్నారు.
రానున్న వారాల్లో దానికి సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండటం వల్ల వారు సహోద్యోగులతో కలవటం, కంపెనీ సంస్కృతిని నేర్చుకోవటం, ట్రైన్ చేయటం వంటి అనేక పనులు సులువుగా మారతాయని సీఈవో అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications