Amazon WFO: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం చాలా మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఉద్యోగుల నుంచి ఉత్తమ పనితీరు కోరుతూ తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీసు పద్ధతిని ప్రవేశపెడుతోంది.

కంపెనీ నిర్ణయం..
అమెరికా కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న అమెజాన్ తన ఉద్యోగులను పనిచేసేందుకు తిరిగి ఆఫీసులకు పిలిపిస్తోంది. కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రావాలని సూచించారు. మే 1 నుంచి వారానికి మూడు రోజులు తప్పక ఆఫీసుల నుంచి ఉద్యోగులు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందు ఆఫీసులకు ఎవరు రావాలని నిర్ణయించే బాధ్యత కంపెనీలోని వ్యక్తిగత బృందాలకు ఉంది.

వారికి వెసులుబాటు..
కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో సేల్స్, కస్టమర్ సపోర్ట్ వంటి ఉద్యోగులకు మాత్రం వెసులుబాటు ఉంటుందని జాస్సీ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించటం అంత సులువైన పనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయని సీఈవో ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్ లో వెల్లడించారు.

ఉద్యోగులకు అనుమానాలు..
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు అమెజాన్ అనుమతించి దాదాపు 3 ఏళ్లు గడుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుస్తున్న ఈ మార్పు ఎలా అమలు చేయబడుతుందనే దానిపై చాలా మంది ఉద్యోగులకు ప్రశ్నలు, అనుమానాలు ఉంటాయని తనకు తెలుసునని సీఈవో అన్నారు.
రానున్న వారాల్లో దానికి సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండటం వల్ల వారు సహోద్యోగులతో కలవటం, కంపెనీ సంస్కృతిని నేర్చుకోవటం, ట్రైన్ చేయటం వంటి అనేక పనులు సులువుగా మారతాయని సీఈవో అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications