Amara Raja: అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ మహబూబ్నగర్ జిల్లాలో 16 GWh, 5 GWh వరకు అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ అండ్ బ్యాటరీ ప్యాక్లను ఉత్పత్తికి మెుట్టమెుదటి గిగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి గ్రీన్ఫీల్డ్ ఉత్పత్తి కేంద్రం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 10 ఏళ్ల వ్యవధిలో రూ.9,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు అమర రాజా గ్రూప్ గతంలో తెలిపింది. శంకుస్థాపన వేడుక అధికారికంగా 'అమర రాజా గిగా కారిడార్' ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. అలాగే పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం భారీగా పెరగనున్నాయి.

ఈ క్రమంలో మాట్లాడిన గల్లా జయదేవ్ తమ ప్రయాణంలో భూమి పూజ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. కేవలం గిగా కారిడార్ ఏర్పాటుకే పరిమితం కాకుండా స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉద్యోగాలు కల్పించట అని వెల్లడించారు. తమ ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఫోకస్ ఏరియాగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అమర రాజా బ్యాటరీస్ తొలి లిథియం సెల్ అండ్ బ్యాటరీ ప్యాక్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవ వేడుకను జరుపుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. దీనికి ముందు మహీంద్రా గ్రూప్ సైతం తమ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తికి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications