Ambani Vs Adani: దేశంలో ఏ కంపెనీని కొనాలన్నా లేదా అమ్మాలన్నా అది తప్పకుండా అదానీ, అంబానీలను దాటాల్సిందే అన్నంత పోటీ నడుస్తోంది. రంగం ఏదైనా అవకాశాలను మాత్రం అంబానీ, అదానీలే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

మరోసారి పోటీ..
దిగ్గజ వ్యాపారవేత్తలైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల మధ్య మరో ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు వ్యాపారవేత్తలకు చెందిన కంపెనీలతో సహా మెుత్తం ఏడు కంపెనీలు ఛత్తీస్గఢ్కు చెందిన పవర్ కంపెనీ SKS పవర్ జనరేషన్ కోసం బిడ్ చేశాయి. ఇదే సమయంలో అంబానీ-అదానీలతో పాటు ప్రభుత్వం కూడా ఈ కంపెనీని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ కంపెనీకి రూ. 1,890 కోట్లకు పైగా రుణాన్ని అందించాయి. దీనికి ముందు అంబానీ, అదానీలు కూడా ల్యాంకో అమర్కంటక్ పవర్ కోసం వేలంలో పోటీపడ్డాయి.

పోటీలో ప్రభుత్వం..
బ్యాంకులకు సంబంధించిన మూలాల ప్రకారం మెుత్తం ఏడు బిడ్లు వచ్చాయని తెలుస్తోంది. తాజా బిడ్డింగ్ ప్రక్రియలో కంపెనీని దక్కించుకోవటానికి అదానీ, అంబానీ, ఎన్టీపీసీలతో పాటు టోరెంట్ పవర్, జిందాల్ పవర్, శారదా ఎనర్జీ అండ్ మినరల్స్, సింగపూర్కు చెందిన వాంటేజ్ పాయింట్ అసెట్ మేనేజ్మెంట్ కూడా SKS పవర్ జనరేషన్ కంపెనీ కోసం బిడ్ చేశాయి. బిడ్డింగ్కు డిసెంబర్ 30 చివరి తేదీ.

4 సార్లు గడువు పొడిగింపు..
కంపెనీకి చెందిన 600 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ వర్కింగ్ కండిషన్లో ఉంది. దీనిని దక్కించుకునేందుకు మొత్తం 23 కంపెనీలు ఆసక్తి చూపాయి. చివరి బిడ్ల సమర్పణకు గడువును బ్యాంకులు ఇప్పటికి 4 సార్లు పొడిగించాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కొందరు బిడ్డర్లు డిమాండ్ చేయడమే ఇందుకు కారణం. NTPC తన సొంత బోర్డు, ప్రభుత్వం నుంచి అనుమతి పొందడానికి మరింత సమయం అవసరమని పేర్కొంది. SKS కార్పొరేట్ దివాలా, పరిష్కార ప్రక్రియ ఏప్రిల్లో ప్రారంభమైంది.

అన్ని సౌకర్యాలు..
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ ప్రస్తుతం 300 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్లను నడుపుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా హాంకాంగ్కు చెందిన అగ్రిట్రేడ్ రిసోర్సెస్ కంపెనీ దీన్ని ఆపరేట్ చేయడంలో విఫలమైంది. ఈ కారణంగా విఫలమవడంతో గత ఏడాది ప్రారంభంలో కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. ఈ పవర్ కంపెనీని అగ్రిట్రేడ్ 2019లో కొనుగోలు చేసింది. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్తో ప్లాంట్ 25 ఏళ్ల ఇంధన సరఫరా ఒప్పందాన్ని కలిగి ఉంది. బొగ్గు రవాణా చేయడానికి ప్లాంట్ వరకు రైల్వే లైన్ కూడా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications