ముంబై: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మార్కెట్లోకి రూ.3.75 లక్షల కోట్లను పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. అవసరమైన చర్యలు ఎప్పటికి అప్పుడు తీసుకుంటామన్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని, ఇలాగే ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్లోకు నగదు పంపింగ్, ఈఎంఐలపై భారీ ఊరట కల్పించారు. ఇప్పటికే వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం ఉంటుందన్నారు. మార్చి నుండి మూడు నెలల పాటు మారటోరియం ఉంటుందని తెలిపారు. మూడు నెలల పాటు మారటోరియం సామాన్యుడికి భారీ ఊరట. ఈ కాలంలో ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నుండి ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో చెల్లించనప్పటికీ క్రెడిట్ స్కోర్ పైన ఎలాంటి ప్రభావం చూపదు. ఎంఎస్ఎఫ్ 1 శాతం పెంపు ప్రకటించారు.

ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని శక్తికాంత దాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మనమంతా సహకరిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో డిపాజిట్ల గురించి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరి డబ్బు సురక్షితంగా ఉందని, అనవసర ఆందోళనకు గురై పెద్ద మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవద్దని సూచించారు. డిపాజిట్ల గురించి ఆందోళన అక్కర్లేదని.. అందరి డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందన్నారు. లాక్ డౌన్స్,సోషల్ డిస్టెన్స్ కారణంగా ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) గుర్తించిందని, ప్రపంచ వృద్ధిలో 2019 దశాబ్దం కనిష్ట స్థాయి నుండి 2020లో నిస్సారంగా కోలుకుంటుందనే అంచనాలు పోయాయని శక్తికాంత దాస్ అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications