2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి అవకాశం దగ్గర పడుతోంది. దీంతో చాలా మంది హడావిడిలో ఉన్నారు.
ఇప్పటి వరకు మీరు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్ 31, 2023 ఇందుకు చివరి అవకాశంగా ఉంది. ఆ తర్వాత ఫైల్ అయ్యే రిటర్నులపై జరిమానాలు, ఆలస్యానికి వడ్డీ చెల్లించాలని గుర్తుంచుకోండి. చట్ట ప్రకారం రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఫైల్ చేసే వారిపై ఆలస్య రుసుము రూ.4,000 ఉండగా.. రూ.5 లక్షలకు మించిన పన్ను చెల్లింపుదారులు రూ.5,000 ఫైన్ చెల్లిచాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో చెల్లించని పన్ను మెుత్తంపై 1 శాతం వడ్డీని కూడా లేటు చేసిన కాలానికి కట్టాల్సి ఉంటుంది.

అలాగే డిసెంబర్ 31, 2023 చివరి గడువు కోల్పోతే.. భారీ ఆర్థికపరమైన చిక్కులు వస్తాయని తెలుస్తోంది. ITR ఫైలింగ్ మిస్ అయితే "నిజమైన కారణాల వల్ల", సెక్షన్-119 కింద జాప్య అభ్యర్థనకు క్షమాపణను దాఖలు చేయవచ్చు. గడువు లోపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేకపోవటానికి గల కారణఆలను పేర్కొంటూ.. ఆలస్యాన్ని క్షమించమని ఆదాయపు పన్ను అధికారులను కోరవచ్చు. ఈ పరిస్థితిలో జరిమానా రూ.10,000, వడ్డీ ఉంటుంది. అలాగే పేర్కొన్న రిటర్న్ను దాఖలు చేసేంత వరకు 1% విధించబడుతుంది.
మీ ఐటీఆర్ను ఫైల్ చేయడానికి వాయిదా వేయడం చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే చాలా మంది చివరి క్షణాల్లో హడావిడిగా పన్నును ఆదా చేసుకునేందుకు సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడుతుంటారు. అవసరం లేకుండా ఎల్ఐసీ, ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయటం, ఏవైనా విలువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు కొనటం, ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయటం లాంటివి చేస్తుంటారు. సరైన గోల్ లేకుండా చేసే పెట్టుబడుల్లో తప్పుల వల్ల భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంటుందని టాక్స్ ప్లానర్లు హెచ్చరిస్తుంటారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications