Axis Bank: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు పెద్ద హెచ్చరిక.. మేలుకోండి బాస్..
Credit Card Fraud: దేశంలోని సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ సారి వారి కన్ను క్రెడిట్ కార్డు హోల్డర్లపై పడినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక వార్త సంచలనంగా మారిపోయింది.
వివరాల్లోకి వెళితే.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగిస్తున్న కొంతమంది కస్టమర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు ఎప్పుడూ చేయని లావాదేవీలను చూస్తున్న చాలా మంది కస్టమర్లు ఉన్నారు. లావాదేవీకి సంబంధించి OTP అందుకున్న కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అయితే వారు ఆ లావాదేవీలను నిర్వహించకుండానే ఓటీపీలు రావటం కలవరం రేపుతోంది. మరికొందరు కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అంతర్జాతీయ లావాదేవీలపై కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు.

సందీప్ శ్రీనివాస్ అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో ఇలా వ్రాశాడు, "యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో చేదు అనుభవం ఎదురైనట్లు అందులో పేర్కొన్నాడు. కెనడాలోని ఈట్స్లో జరిగిన మోసపూరిత లావాదేవీలో ఒక కార్డు ఉపయోగించబడిందని చెప్పాడు. అయితే తాను అలాంటి లావాదేవీలేమీ చేయలేదని వెల్లడించాడు. దీనిపై తాను ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా బ్యాంక్ అందుకు నిరాకరించినట్లు చెప్పాడు.
సందీప్ మాత్రమే కాకుండా.. చాలా మంది కస్టమర్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఇలాంటి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన బ్యాంక్ మాత్రం తమ ఖాతాదారులందరి డేటా సురక్షితంగా ఉందని తెలిపింది. తమవద్ద ఎలాంటి డేటా ఉల్లంఘన జరగలేదని యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ చెల్లింపుల విభాగం అధిపతి సంజీవ్ మోఘే వెల్లడించారు. కస్టమర్ డేటా పూర్తిగా సురక్షితం. ప్రతిరోజు సుమారు రూ.500 కోట్ల విలువైన క్రెడిట్ కార్డు లావాదేవీలను బ్యాంకు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని యాక్సిస్ బ్యాంక్ చాలా సీరియస్గా తీసుకుందని మోఘే తెలిపారు. ఫిర్యాదులు చేయబడుతున్న కార్డును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కస్టమర్లకు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా ఆ డబ్బు తిరిగి అందించబడుతుందని హామీ ఇచ్చారు. ఈ మొత్తం ఘటనను బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించింది.


Click it and Unblock the Notifications