ఒక పక్క బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, మరోపక్క అక్షయ తృతీయ సందర్భంగా ఆభరణాల షాపులు, జ్యువెలరీ స్టోర్లు కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త వినూత్న ఆఫర్లతో ముందుకు వచ్చాయి. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా ఇతర విలువైన లోహాలు కొనడం చాల శుభప్రదంగా భావిస్తారు, మరొకొందరు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. దింతో నగరంలోని ప్రముఖ జ్యువెలరీ స్టోర్లు తనిష్క్, సెంకో గోల్డ్, ఎంపీ జ్యువెలర్స్ ఇంకా పిసి చంద్ర జ్యువెలర్స్ వంటి పెద్ద బ్రాండ్లు ఆఫర్లను ప్రారంభించాయి.

తనిష్క్ బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 20% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఈ బ్రాండ్ తక్కువ బరువు గల ఆభరణాలు ఇంకా 18 క్యారెట్ల ఆభరణాలను కూడా అందిస్తోంది, ఇలా పెరుగుతున్న బంగారం ధరల భారం నుండి కస్టమర్లు కొంతవరకు రిలీఫ్ పొందవచ్చు. సెంకో గోల్డ్ బంగారం ఇంకా వజ్రాభరణాలపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. బంగారం రేటుపై రూ.350 స్పెషల్ డిస్కౌంట్ ఇస్తుంది. అంతేకాదు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై ఇక్కడ 30% వరకు డిస్కౌంట్ కూడా ఉంది.
ఎంపీ జ్యువెలర్స్ బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.300 డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో పాటు మేకింగ్ ఛార్జీలను కూడా 10% తగ్గించారు. అదేవిధంగా PC చంద్ర జ్యువెలర్స్ బంగారం ధరలపై గ్రాముకు రూ.200 డిస్కౌంట్ అందిస్తోంది. తయారీ ఛార్జీలపై 15% డిస్కౌంట్ ఇంకా వజ్రాభరణాల కొనుగోలుపై 10% తగ్గింపు అందిస్తుంది.
పెరిగిన కస్టమర్ నమ్మకం : "బంగారంపై కస్టమర్ల నమ్మకం బాగా పెరిగింది కాబట్టి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అవుతుందని మేము ఆశిస్తున్నాము" అని అంజలి జ్యువెలర్స్ డైరెక్టర్ అన్నరాఘ ఉత్తియా చౌదరి అన్నారు. ఈ బంగారం వ్యామోహాన్ని ఉపయోగించుకోవడానికి, కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మరింత ఆనందంగా మార్చడానికి మేము మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లను అందిస్తున్నాము అని కూడా అన్నారు.
ధర పెరిగినప్పుడు, అమ్మే పద్ధతి మారింది: పెరుగుతున్న బంగారం ధరలను తట్టుకునేందుకు ఆభరణాల బ్రాండ్లు అమ్మకాల
పద్ధతులను కూడా మార్చుకుంటున్నాయి. బంగారం ధరలు పెరగడం వల్ల ఆభరణాల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయని సెంకో గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ అన్నారు. అయితే ఈ నగలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కంపెనీ కోరుకుంటోంది. 'వివాహ ఆభరణాల ధరలను 25-30% తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నాము' అని ఆయన అన్నారు. దీని కోసం బంగారం వాడకం తగ్గించడానికి మేము ఆభరణాలలో ముత్యాలు ఇంకా రాళ్లను జోడిస్తున్నాము అని తెలిపారు.
అక్షయ తృతీయ శుభ సమయం: అక్షయ తృతీయ నేడు బుధవారం ఏప్రిల్ 30 జరుపుకుంటారు. ఈ పండుగను ప్రార్థనలు ఇంకా బంగారం కొనుగోళ్లతో నిండి ఉంటుంది. అయితే, బంగారం కొనడానికి మంచి సమయం ఏప్రిల్ 29న సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30 రోజు మధ్యాహ్నం 2:12 గంటల వరకు కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications