ajit pawar: మహారాష్ట్రలో పెను విషాదం: విమాన ప్రమాదంలో కీలక నేత మృతి!

మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar)అ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వార్త తెలియగానే యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగలిగే శక్తి ఉన్న అజిత్ పవార్ (Ajit Pawar) (66) మరణం అటు ఆయన పార్టీకి, ఇటు ప్రభుత్వానికి తీరని లోటుగా మారింది.

ajit pawar plane crash maharashtra deputy cm baramati aircraft accident death updates dgca investigation news

ప్రమాదం ఎలా జరిగింది?

జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి విమానంలో బయల్దేరారు. ఉదయం 8:45 గంటల ప్రాంతంలో విమానం బారామతికి చేరువలో ఉన్న సమయంలో అదుపుతప్పి కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, విమానం అదుపు తప్పి కిందకు పడిపోగానే భారీగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు ఆయన వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు విమాన సిబ్బంది (పైలట్లు) ఉన్నట్లు డీజీసీఏ (DGCA) ధృవీకరించింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలై పూర్తిగా దగ్ధమైంది.

రాజకీయ ప్రస్థానం: బారామతి 'దాదా'గా గుర్తింపు

1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్, ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ సోదరుడు అనంత్ రావు పవార్ కుమారుడు. బాబాయి అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో అపారమైన అనుభవాన్ని గడించారు. 1982లో సహకార రంగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా 16 ఏళ్ల పాటు పనిచేశారు. 1991లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, తన బాబాయి శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి తన సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంతాపం

అజిత్ పవార్ హఠాన్మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక సమర్థవంతమైన పాలకుడిని, ప్రజల మనిషిని కోల్పోయామని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలియగానే బారామతిలో విషాద ఛాయలు అలముకున్నాయి. డీజీసీఏ ఈ విమాన ప్రమాదంపై లోతైన విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+