ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. రూ.19కే ఆన్ లిమిటెడ్ కాల్స్..
కస్టమర్స్ను ఆకట్టుకునేందుకు నెట్ వర్క్ సంస్థలు కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. డేటా, టాక్ టైమ్ ఎక్కువ ఇచ్చే సంస్థల వైపు వినియోగదారులు మొగ్గుచూపతారు. తమ కస్టమర్స్ను ఆకట్టుకునేందుకు ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. చౌక రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 19తో రీ చార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకునే వెసులుబాటు కల్పించింది.
ఎయిర్టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్తో మొబైల్ నంబర్ రీచార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్... రూ. 19కే ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ రీచార్జ్ ప్లాన్ను 'ట్రూలీ అన్లిమిటెడ్' కేటగిరి కింద అందజేస్తోంది. అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని అర్థం వస్తోంది. రూ. 19 కే అన్లిమిటెడ్ కాల్స్ అనేది చెప్పుకోదగిన అంశమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం కాల్స్ కాదు 200 ఎంబీ డేటా కూడా వస్తుంది.
ప్రతీ నెలా, లేదంటే మూడు నెలలకు ఒకసారి రీచార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒకేసారి సంవత్సరానికి రీచార్జ్ చేసుకోవచ్చు. రూ. 2698 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. దీంతో డిస్నీ హాట్స్టర్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగానే లభించనుంది. తమ కొత్త ప్లాన్ వినియోగదారులకు పూర్తి వెసులుబాటుగా ఉంటుందని ఎయిర్టెల్ కంపెనీ చెబుతోంది.