Airtel offer: కోట్లమంది కస్టమర్లకు 'డబుల్' బెనిఫిట్, రూ.49 ఉచిత రీచార్జ్
ఎయిర్టెల్ తన 5.5 కోట్ల అల్పాదాయ కస్టమర్ల కోసం మంచి ఆఫర్ తీసుకు వచ్చింది. వినియోగదారులకు రూ.49 రీచార్జ్ ప్యాక్ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ సన్నిహితులతో అనుసంధానమై ఉండేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపింది. ఈ ప్యాక్తో 28 రోజుల పాటు చెల్లిబాటు అయ్యేలా రూ.38 టాక్ టైమ్, 100 MB డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాల్యూ రూ.270 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాదు, రూ.79తో రీచార్జ్ కూపన్ను కొనుగోలు చేస్తే వారు రెట్టింపు ప్రయోజనం పొందవచ్చును. ఈ రెండు ప్రయోజనాలు ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఇది ఏకకాల ఆఫర్. రూ.49 ఉచిత ప్యాక్ ప్లాన్ 5.5 కోట్లమంది తక్కువ ఆదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపింది.
అంతకుముందు ఎయిర్టెల్ తన డిజిటల్ ప్లాట్ఫాంను పెంచడం ద్వారా కస్టమర్ల కోసం పలు రకాల కోవిడ్ మద్దతు కార్యక్రమాలను ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృమవుతోన్న పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు ప్రజలకు డిజిటల్ సాధనాలను ప్రవేశపెట్టిన సంస్థల జాబితాలో ఎయిర్టెల్ చేరింది.