Airtel, Jio discontinue Rs 249 prepaid plans : టెలికం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలు ఎయిర్ టెల్, జియోలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. గత సంవత్సరం జూలైలో Jio, Airtel, Vi లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి విదితమే. తాజాగా ఈ దిగ్గజాలు మళ్లీ ప్లాన్లలో పలు మార్పులు చేశాయి. దాదాపు ఏడాది పాటు అన్ని ప్లాన్లను స్థిరంగానే ఉంచిన ఈ కంపెనీలు ఇప్పుడు బేసిక్ ప్లాన్లను ఎత్తివేశాయి. వాటికి వేరే ధరను నిర్ణయించాయి. ఇప్పటికే లక్షలాది మంది వాడుతున్న రోజువారీ 1GB డేటా ప్లాన్లను ఈ దిగ్గజాలు తొలగించాయి.రిలయన్స్ జియో తన బేసిక్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ను సైలెంట్ గా నిలిపివేయగా.. భారతీ ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. రూ.249 బేసిక్ ప్లాన్ ఎంపికను నిలిపివేసింది.
ఎయిర్టెల్ రూ.249 రీచార్జ్ ప్లాన్ను నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా చందాదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. 1GB రోజు డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు 24 రోజుల చెల్లుబాటును అందిస్తూ.. చిన్న గడువులో తక్కువ ఖర్చుతో చేయదగిన ఒక "ఎంట్రీ లెవల్" ప్లాన్గా ఇది వినియోగదారులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అధిక కాలవ్యవధి ప్లాన్లకు ముందుగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలనుకునే వారు ఈ ప్యాక్ను "గో-టు" ప్లాన్గా ఉపయోగించేవారు.

అయితే.. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఒక నోటీసు విడుదల చేస్తూ ఆగస్టు 20, 2025 నుండి ఈ ప్లాన్ ఇక అందుబాటులో ఉండదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ ప్లాన్ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడా కనిపించడం లేదు.. అంటే వినియోగదారులకు ఇక నుంచి దీన్ని రీచార్జ్ చేసుకునే అవకాశం లేదు.
ఇక రిలయన్స్ జియో కూడా తన రెండింటి బడ్జెట్ ప్లాన్లైన రూ.209 (1GB/రోజు - 22 రోజులు), రూ.249 (1GB/రోజు - 28 రోజులు) ప్లాన్లను సడన్ గా నిలిపివేసింది. దీంతో జియో బేస్ ప్రీపెయిడ్ టారిఫ్ లెవెల్ రూ.299 కు చేరింది. జియో వినియోగదారుడు కనీసం రూ.299 ఖర్చుచేసినప్పుడే డేటా + కాలింగ్తో కూడిన ప్లాన్ పొందగలడు. NDTV Profit కథనం ప్రకారం, ఈ బడ్జెట్ ప్లాన్లు ఇంకా ఒక్కోచోట రిటైల్ అవుట్లెట్స్లో లభిస్తున్నప్పటికీ..జియో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా రీచార్జ్ చేసుకునే యూజర్లుగా చూసుకుంటే ఈ మార్పు వెంటనే అమలులోకి వచ్చిందనే చెప్పాలి.
ఎయిర్టెల్ రూ.249 ప్లాన్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చిన్న నగరాల్లో, స్టూడెంట్లు ఎక్కువగా రోజులా షార్ట్ టర్మ్ రీఛార్జ్ చేసుకునే వారు.కాగా టెల్కోలు ఇప్పుడు వినియోగదారులను సుదీర్ఘ కాలపు లేదా ప్రీమియం ప్లాన్ల వైపు మళ్లిస్తున్నారు. ఎక్కువ డేటా లేదా OTT సబ్స్క్రిప్షన్లుగా బండిల్ చేసిన ప్లాన్లే ప్రధానంగా కనిపిస్తున్నాయి.మంగళవారం ఎయిర్టెల్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. Airtel Thanks యాప్ పనిచేయకుండా పోయిందని, కాల్స్/డేటా కూడా పనిచేయడంలేదని డౌన్డిటెక్టర్ ప్లాట్ఫామ్లో ఒక్కసారిగా 3,500కు మించి ఫిర్యాదుల సంఖ్య నమోదైంది
More From GoodReturns

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications