Flight Ticket Offers: రానున్న నెలల్లో మీరు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే.. విమాన టిక్కెట్లపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్లను.. దేశీయ బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇండిగో, స్పైస్జెట్, గోఫస్ట్, ఎయిర్ ఏషియా ఇండియా సంస్థలు అందిస్తున్నాయి. ఈ సెల్ లో అతి తక్కువ ధరకే కేవలం రూ.1498కే విమాన ప్రయాణ టిక్కెట్లను అందిస్తున్నారు. స్పైస్జెట్ 'సీజన్ సేల్' పేరుతో; ఇండిగో 'లెట్స్ సేల్ విత్ ఇండిగో' కింద చౌక టిక్కెట్లను అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండిగో టిక్కెట్లు రూ. 1499కే..
దేశీయ విమానాల బుకింగ్ కోసం రూ.1499 నుంచి విమాన టిక్కెట్లను అందిస్తోంది ఇండిగో సంస్థ. ఈ బుకింగ్ అన్ని మోడ్ల ద్వారా చేయవచ్చు. కస్టమర్లు ఈ ఆఫర్ కింద జూలై 28, 2022 నుంచి జూలై 31, 2022 వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15, 2022 నుంచి డిసెంబర్ 31, 2022 మధ్య ఉంటుంది. అంటే ప్రయాణికులు అడ్వాన్స్ గా టికెట్లను తక్కువ రేటులో కొనుగోలు చేయవచ్చు.

స్పైస్ జెట్ సేల్..
స్పైస్ జెట్ దేశీయ విమానాల ప్రయాణాల కోసం రూ.1498 నుంచి విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఈ సేల్ జూలై 29న ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగుతుంది. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 25 మధ్య ఉంటుందని వెల్లడించింది. ఈ మధ్య కాలంలో ప్రయాణాలు చేసేవారు ముందుగానే టిక్కెట్లను తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

గో ఫస్ట్ స్పెషల్ ఆఫర్..
గో ఫస్ట్ తన కస్టమర్ల కోసం రాక్ బాటమ్ సేల్తో ముందుకు వచ్చింది. ఈ ఎయిర్లైన్ దేశీయ విమానాలకు రూ.1799 నుంచి విమాన టిక్కెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద జూలై 28-జూలై 31 మధ్య బుకింగ్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15, 2022 నుంచి మార్చి 31, 2023 మధ్య ఉంటుంది.

ఎయిర్ ఏషియా ఇండియా 'పే డే సేల్'
ఎయిర్ ఏషియా ఇండియా తన కస్టమర్ల కోసం 'పే డే సేల్' పేరుతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీ-జైపూర్ వంటి రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1,499 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్ కింద.. వినియోగదారులు జూలై 28-జూలై 31 మధ్య బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ కాలం ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 31, 2022 వరకు ఉంటుంది. ఇది కాకుండా.. ఎయిర్ ఏషియా ఇండియా తన నెట్వర్క్లో మరిన్ని డిస్కౌంట్ సేల్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది.

విదేశీ ప్రయాణ కేవలం టిక్కెట్ రూ.9
ఇవన్నీ ఇలా ఉండగా విదేశాలకు కేవలం బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువ రేటుకే ప్రయాణించేందుకు సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. వియత్నాంకు చెందిన విమానయాన సంస్థ వియట్జెట్ చాలా చౌకగా విమాన టిక్కెట్ల ఆఫర్తో ముందుకు వచ్చింది. ఇప్పుడు Vietjet దాదాపు ఉచిత ప్రమోషన్ ఆఫర్ తిరిగి వచ్చింది. ఈ ఆఫర్లో మీరు కేవలం రూ.9తో విమాన ప్రయాణ టిక్కెట్ను కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆఫర్ కింద ఎయిర్లైన్ సంస్థ దాదాపు 30,000 ప్రమోషనల్ టిక్కెట్లను అందిస్తోంది. ఈ టిక్కెట్లు భారత్- వియత్నాం మధ్య 17 ప్రత్యక్ష మార్గాల కోసం అందుబాటులో ఉన్నాయి. 26 ఆగస్టు 2022 వరకు ప్రతి బుధ, గురు మరియు శుక్రవారాల్లో ప్రయాణీకులు ఈ చౌక ప్రమోషనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. VietJet వెబ్సైట్ www.vietjetair.comని సందర్శించడం కస్టమర్లు ఈ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15, 2022 నుంచి మార్చి 26, 2023 వరకు ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications