Air India Tragedy: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ విషాదకర ఘటన నిలిచింది. ఈ దుర్ఘటనలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఘోర ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఏఐ171 విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరి కథ దేశ ప్రజల గుండెను పిండేస్తోంది.
ఈ ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చగీస్ వాసులు, కెనడా దేశస్థుడు ఒకరు ఉన్నారని ప్రకటించింది. ఇక ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది.

అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని స్పష్టం చేసింది.ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తామనిని చంద్రశేఖరన్ తన ప్రకటనలో వివరించారు.

ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ ప్రాణాలు కోల్పోగా..విశ్వాశ్ కుమార్ రమేశ్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాశ్ కుమార్ విమానంలో 11ఏ నంబర్ సీటులో ఎడమవైపున ఉన్న అత్యవసర ద్వారం పక్కన కూర్చుని ఉండగా.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని తెలిపారు. దీంతో తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని ఆయన తెలిపారు. విమానం ముక్కలైనప్పుడు తాను సీటు బెల్టుతో ఉండగానే బయటకు ఎగిరిపడ్డానని బయటకు దూకలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రయాణికుడు ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
యువతి ప్రాణాలను నిలబెట్టిన పది నిమిషాల ఆలస్యం: భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్ AI171 కు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. కేవలం 10 నిమిషాల ఆలస్యం వల్ల ఆమె ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆమె ఎయిర్ పోర్టుకు చేరుకునే లోపే.. ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదని ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
తండ్రికి ఇచ్చిన మాటను నిలుపుకోలేక: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందిన సంగతి విదితమే. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని తండ్రికి మాట ఇచ్చారు. కానీ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించారు.

మాజీ ముఖ్యమంత్రికి కలిసిరాని లక్కీ నంబర్: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి ఆయన ఎంతగానో ఇష్టపడే లక్కీ నంబర్ కలిసిరాలేదు. ఆ నంబరే ఆయన ప్రాణాలను బలితీసుకుంది. మాజీ సీఎం విజయ్ రూపానీ 1206ను అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. స్కూటర్ల నుంచి కార్ల వరకు అన్నివాహనాలకు ఆయన అదే నంబర్ వాడుతారు. 6 నెలలో 12 వ తేదీన మాజీ సీఎం విమాన ప్రమాదంలో మరణించడంతో లక్కీ నంబర్ ఆయన జీవితాన్ని ముగించి వేసింది. లండన్లో ఉన్న కూతుర్ని కలిసేందుకు ఆయన విమానంలో బయలు దేరారు. ఈలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కాబోయే డాక్టర్లు ప్రపంచానికి వీడ్కోలు: అహ్మదాబాద్లోని బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కూలిపోవడంతో అక్కడ ఉన్న కాబోయే డాక్టర్లు చాలామంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

లండన్ లో సెటిల్ అవుదామనుకుని తిరిగి రాని లోకాలకు: ఈ ఘోర విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన ఓ డాక్టర్ కుటుంబం మొత్తం మరణించింది.డాక్టర్ కోమి వ్యాస్ అనే డాక్టర్ తన భర్తతో కలిసి లండన్ లో సెటిలవ్వాలని ఆలోచనతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి విమానం ఎక్కారు. అయితే లండన్ లో సెటిలవ్వకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్యా, పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకొన్నారు. విమాన ప్రమాదం వారి ఆశల్ని చిదిమేసింది.
భర్తను చూడకుండానే కన్నుమూసిన నవ వధువు: పెళ్లి అనంతరం మొట్టమొదటిసారి తన భర్తను కలవబోతుందన్న ఆశ నెరవేరకుండానే ఓ నవ వధువు విమాన ప్రమాదంలో మృతి చెందింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications