Multibagger Stock: లక్షను రూ.26 కోట్లు చేసిన స్టాక్.. ఒకప్పుడు రేటు 35 పైసలే..!!
Multibagger Stock: ఒకప్పుడు కేవలం పైసలకు లభించిన షేర్లు ప్రస్తుతం మార్కెట్లలో తమ హవా చాటుతున్నాయి. అప్పుడు పెన్నీ షేర్లుగా ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి.
నమ్ముకున్న ఇన్వెస్టర్ల తలరాతను మార్చిన సింఫనీ కంపెనీ షేర్ల గురించే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది. కంపెనీ పేరు వినగానే వేసవిలో చల్లటి గాలిని అందించే కూలర్లే మనకు ముందుగా గుర్తుకొస్తాయి. గడచిన కొన్నేళ్లలో సింఫనీ స్టాక్ ఏకంగా 2,59,000 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. ఈ క్రమంలో షేరు ధర 35 పైసల నుంచి పెరిగి ప్రస్తుతం రూ.900 స్థాయి వద్ద కొనసాగుతోంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయంలో స్టాక్ 2 శాతం మేర నష్టపోయి రూ.900 వద్ద ముగిసింది.

జూలై 11, 2003లో సింఫనీ షేర్ ధర బీఎస్ఈలో కేవలం 35 పైసలుగా ఉంది. ఆ సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ఆ పెట్టుబడి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.25.9 కోట్లుగా ఉండేది. ఈ క్రమంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి కోటీశ్వరులుగా మార్చేసింది. అలాగే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,219గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.820.60గా ఉంది.
15 ఏళ్ల కిందట జూలై 25, 2008లో సింఫనీ స్టాక్ ధర రూ.3.38గా ఉంది. కనీసం ఈ ధర వద్ద కంపెనీ షేర్లను కొని ఇప్పటి వరకు హోల్డ్ చేసి ఉంటే లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ.2.6 కోట్లుగా మారి ఉండేది. గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా 1988లో ప్రారంభమైన కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రధానంగా ఎయిర్ కూలర్ల తయారీలో స్పెషలైజేషన్ కలిగి ఉంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications