అమెరికా H-1B కొత్త పాలసీ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చే టాలెంట్ కోసం భారత్‌ సిద్దమా? అసల వారికి అవకాశాలున్నాయా?

సిలికాన్ వ్యాలీకి ఎన్నో ఏళ్లుగా ప్రతిభను పంపిస్తున్న H-1B వీసా ఇప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం తాజాగా కొత్త ఫీజులను పెట్టడంతో ఈ వీసా ప్రాసెస్‌ చేసే కంపెనీలకు ఆర్థిక భారం మరింతగా పెరిగిపోతోంది. దీనివల్ల ముఖ్యంగా భారతీయ టెక్ వర్క్‌ఫోర్స్‌కు అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికీ అమెరికాలో పనిచేయాలని కలలు కనే ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు H-1B మీదే ఎక్కువగా ఆధారపడతారు. కానీ ఇప్పుడు ఖర్చులు పెరగడంతో కంపెనీలు కొత్త రిక్రూట్‌మెంట్‌లో జాగ్రత్తలు తీసుకోవచ్చు, కొంత వెనుకడుగు వేయవచ్చు కూడా. ఇది మొత్తం మీద భారత టెక్ ప్రతిభకు అమెరికా డ్రీమ్ కొంత కష్టంగా మారుతోందనే భావన కలిగిస్తోంది.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం. H-1B వీసా కోసం కంపెనీలు ఇప్పుడు సంవత్సరానికి "$100,000 (సుమారు రూ. 83 లక్షలు)" ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడు సంవత్సరాల వీసా ఖర్చు దాదాపు రూ. 2.5 కోట్లు అవుతుంది.

After the US H-1B Policy Change Does India Have Career Platforms for Returning Talent

స్టార్టప్ ఇన్వెస్టర్, మాజీ H-1B వీసా హోల్డర్ హేమంత్ మోహాపాత్ర చెబుతున్నది ఏమిటంటే ఇంత భారీ ఫీజు కేవలం గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు మాత్రమే భరించగలవు. చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు మాత్రం ఇది పెద్ద అడ్డంకి అవుతుంది. అలాగే సెమీకండక్టర్, బయోటెక్, రోబోటిక్స్ వంటి అధునాతన రంగాల్లో పని చేసే ప్రతిభావంతులు అమెరికా బదులు ఆస్ట్రేలియా, యూకే లేదా స్వదేశం భారత్‌నే ఆశ్రయించే అవకాశం ఎక్కువ.

అమెరికా ప్లాన్: "ట్రైన్ అమెరికన్స్"
అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ ప్రకటనలో స్పష్టంగా చెప్పారు "అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి, బయట నుంచి రప్పించకూడదు." అమెరికాలో ఉన్న వలస వ్యతిరేక వాతావరణం ఈ నిర్ణయంలో కూడా కనిపిస్తుంది. 2024లో మంజూరైన H-1B వీసాల్లో "71% భారతీయులకే" వచ్చాయి. అందుకే నిపుణులు అంటున్న ప్రకారం ఇది నేరుగా భారత టెక్ టాలెంట్‌కి షాక్ గానే మారుతుంది.

2025లో అమెజాన్ మాత్రమే 12,000 H-1B వీసాలు పొందింది. కొత్త ఫీజు రూల్స్ ప్రకారం, వారికి మూడు ఏళ్లలో అదనంగా $3.6 బిలియన్ (రూ. 30,000 కోట్లు పైగా) ఖర్చవుతుంది. ఎలోన్ మస్క్ కూడా ఈ పాలసీని వ్యతిరేకిస్తూ, "ఇది అమెరికా కంపెనీలను గ్లోబల్ టాలెంట్‌ను నియమించుకోవడం నుంచి వెనక్కి నెడుతుంది" అని అన్నారు. ఫీజులు ఇంత పెరిగితే అమెరికా కంపెనీలు రీసెర్చ్, డెవలప్‌మెంట్ పనులను భారత్‌కి లేదా ఇతర దేశాలకు అవుట్‌సోర్స్ చేసే అవకాశం ఉంది.

హేమంత్ మోహాపాత్ర మాట్లాడుతూ, "ఇప్పుడు భారత్ సరైన అవకాశాలు ఇస్తే, తిరిగి వచ్చే ప్రతిభావంతుల వలన దేశానికి పెద్ద లాభం ఉంటుంది. లేకపోతే వారు ఆస్ట్రేలియా, యూకే వైపు వెళ్తారు లేదా వేరే కెరీర్‌లో ఇరుక్కుపోతారు" అని చెప్పారు. ఇప్పటికే అమెరికా సెమీకండక్టర్ టాలెంట్‌లో 20-30% భారత్‌లో పనిచేస్తున్నారు. ఈ మార్పుతో ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చు. తక్షణ లాభం కోసం అమెరికా ఈ ఫీజులు పెట్టినా, దీర్ఘకాలంలో మాత్రం ఇన్నోవేషన్ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇప్పటివరకు ప్రపంచ టెక్ టాలెంట్ హబ్‌గా నిలిచింది. కానీ ఈ విధానాలతో భవిష్యత్తులో ఆ ఆధిపత్యం కోల్పోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి, అమెరికా నిర్ణయం భారత టెక్ టాలెంట్‌కి ఒక రిస్క్ అయినా, అదే సమయంలో ఒక "అవకాశం" కూడా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భారత్ నిజంగా తిరిగి వచ్చే ఈ టాలెంట్‌కి సరైన కెరీర్ ప్లాట్‌ఫామ్ ఇవ్వగలదా లేదా అన్నది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+