variable pay: ఐటీ రంగంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు ప్రస్తుతం దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఎందుకంటే కఠినమైన వ్యాపార పరిస్థితుల కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల వేరియబుల్ వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నాయి.
నాలుగో త్రైమాసికంలో దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో తన ఉద్యోగులకు 80.25% వేరియబుల్ పేను విడుదల చేసింది. ఇదే సమయంలో మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాత్రం కేవలం 60 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనున్నట్లు వెల్లడైంది. విప్రో క్యూ-3లో 87 శాతం, క్యూ-2లో 100 శాతం వేరియబుల్ వేతనాన్ని ఉద్యోగులకు చెల్లించింది.మే పేరోల్లో ఉద్యోగులు తమ పనితీరు వేతనాన్ని అందుకోనున్నారు. టీసీఎస్ మాత్రం 100 శాతం వేరియబుల్ వేతనాన్ని ఉద్యోగులకు అందించింది.

కంపెనీలకు డీల్స్ వేగంగా ముందుకు సాగకపోవటం.. ఖర్చులను మదించుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్న వాతావరణంలో కంపెనీలు పోరాడుతున్నాయి. ఇది క్యూ-4 వేరియబుల్ వేతనాలపై పడింది. ముఖ్యంగా భారతీయ టెక్ కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా ఉద్యోగులను తొలగించలేదు. డీల్స్ రాంప్ డౌన్ కారణంగా కంపెనీలు అంచనా వేసిన Q4 గణాంకాల కంటే తక్కువగా నివేదించబడ్డాయి.
మెుత్తానికి గత ఆర్థిక సంవత్సరం దేశంలోని ఐటీ కంపెనీలు బలమైన పనితీరు కనబరిచినప్పటికీ.. చివరి త్రైమాసికంలో మాత్రం అస్థిర మార్కెట్లు, ఊహించని సంఘటనలు కంపెనీలను ప్రభావితం చేసినట్లు ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. మార్కెట్లో వస్తున్న మార్పుల పట్ల వారు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో ఆదాయాలు తగ్గుతాయని ఇన్ఫోసిస్ ఇప్పటికే అంచనా వేసింది. అందుకే చాలా టెక్ కంపెనీలు తాత్కాలికంగా నియామకాలను నిలిపివేశాయి. వీటికి తోడు పెద్ద ప్రాజెక్టుల రద్దు, బ్యాంకింగ్ సంక్షోభం, టెక్ రంగంలో భారీగా తొలగింపులు ఆందోళనలను కలిగిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications