Chandrababu Naidu: చంద్రబాబు హామీతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో Sensex-Nifty

Stock Markets: నేడు ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత కొన్ని గంటల్లో అనూహ్యంగా తిరిగి పుంజుకున్నాయి. అయితే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. ప్రస్తుతం ఆయన పేరు నేషనల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వాస్తవానికి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ గెలుచుకోవటంలో చతికిలపడటంతో మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆయనకు గ్యాలం వేసేందుకు తమ ప్రయత్నాలు తాము తెరవెనుక చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

After Chandrababu naidu announced alligned with BJP stock markets bull rally started

ఈ క్రమంలో ఫలితాల్లో బిజెపి మ్యాజిక్ ఫిగర్‌ను పొందడంలో విఫలమైన తర్వాత టిడిపి నాయకుడు తన ఎత్తుగడకు సంబంధించిన పుకార్లను క్లియర్ చేయటంతో బుల్స్ తిరిగి రంగంలోకి దిగారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను నుంటి ఒక్కసారిగా తేరుకోవటంతో ట్రెండ్ రివర్స్ అయ్యింది. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటన తర్వాత భారత స్టాక్ మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచిందని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ వెల్లడించారు. మూడవ సారి, బిజెపి దాదాపు 20 బేసి స్థానాల్లో విఫలమైంది. ఇది ఫలితాల అనంతర దృష్టాంతంలో టీడీపీ, ఇతర కూటమి భాగస్వాముల పాత్ర గురించి పుకార్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే.

బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇలాంటి పుకార్లు రావడంతో పెట్టుబడిదారుల మదిలో సందేహం నెలకొందని, టీడీపీ నేతల ప్రకటనతో ఆ సందేహం తొలగిపోయింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు తాను ఎన్‌డిఎతోనే కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మెరుగైన ఆంధ్రా కోసం తీర్పునిచ్చారని, ఓటర్ల అంచనాలకు తగ్గట్టుగా టీడీపీ, బీజేపీలు కలిసి పనిచేస్తాయన్నారు. దీంతో ఇంట్రాడేలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడేలో 2 శాతం మేర పెరిగి గరిష్ట స్థాయి 22,445ని తాకింది. అలాగే సెన్సెక్స్ సూచీ సైతం 73,851 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.

మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1600 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 518 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1369 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1775 పాయింట్లు గెయిన్ అయ్యి నిన్నటి భారీ నష్టాల నుంచి ఇన్వెస్టర్లకు ఊరటను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో బాబు మాటే శాశనం అన్నట్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మోదీ హవా మసకరబారటంతో పాటు కేంద్రంలో తెలుగు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే క్రమంలో హెరిటేడ్ కంపెనీ షేర్లు సైతం భారీ ర్యాలీని కొనసాగిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+