Recession In India: ప్రపంచ వ్యాప్తంగా అదుపులోకి రాని ద్రవ్యోల్బణం కారణంగా దేశాలకు ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంకులు చేపడుతున్న చర్యలు పూర్తి స్థాయిలో అనుకున్న ఫలితాలను ఇవ్వటం లేదు. ఇప్పటికే ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఆర్థిక మాంద్యం సుడిగుండంలో చిక్కుకున్నాయి. కొన్ని చిన్న దేశాలు సైతం ఇరుకున్నాయి.

భారత్ పరిస్థితి..?
ప్రస్తుతం పరిస్థితులను చూస్తుండే ఇండియా సైతం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించిన సంకేతాలు మనకు అదే విషయాన్ని చెబుతున్నాయి. మే 2015 తర్వాత మెుదటి సారిగా భారత బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వర్ట్ కావటం ఇదే విషయాన్ని సూచిస్తోంది. 364-రోజుల ట్రెజరీ బిల్లు కటాఫ్ ఈల్డ్ క్లుప్తంగా బెంచ్మార్క్ 10-సంవత్సరాల బాండ్ కంటే ఎక్కువ పెరగటం ఇప్పుడు ఆర్థిక వేత్తలను ఆందోళనలోకి నెడుతోంది. ఇది ఆర్థిక మాంద్యం రావటానికి ముందు కనిపించే ఒక కీలక సంకేతం.

చివరిగా 2015లో..
మే 2015లో ఏడాది కాల పరిమితి బాండ్ 10 సంవత్సరాల బాండ్ కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యింది. తాజాగా RBI బుధవారం నాడు 364-రోజుల నోట్లను 7.48 శాతం వడ్డీ రేటుకు విక్రయించింది. అయితే 10 సంవత్సరాల బెంచ్మార్క్ బాండ్ రాబడి 7.26 శాతంగా ఉంది. 2032 బాండ్ ఈల్డ్ గరిష్ఠంగా 7.4728 శాతాన్ని తాకి 7.4547 శాతం రేటు వద్ద ముగిసింది. అక్టోబర్ 2018 నుంచి ఇతి అత్యధిక రేటు కావటం మార్కెట్లలో ఆందోళనలకు కారణంగా మారింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలగానికి ఒక విధంగా ఇది కూడా కారణమనే చెప్పుకోవచ్చు.
బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ అంటే ఏమిటి?
తక్కువ కాలం బాండ్లపై వడ్డీ రాబడి దీర్ఘకాలికి బాండ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ అని అంచారు. ఉదాహరణకు 365 రోజుల కాలానికి సంబంధించిన బాండ్ రాబడి 10 ఏళ్ల కాలానికి విడుదలైన బాండ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని ఈల్డ్ కర్వ్ ఇన్వెర్షన్ అని పిలుస్తారు. ప్రస్తుతం దేశాలోని ఏడాది కాలానికి సంబంధించిన ప్రభుత్వ బాండ్స్ ఎక్కువ దిగుబడిని సాధించటంతో భయాందోళనలు మెుదలయ్యాయి.

బ్రోకరేజీలు ఏమంటున్నాయంటే..?
ప్రస్తుత హెచ్చరికలను చూస్తుంటే భారతదేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందా అని చాలా మంది సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ట్రెజరీ బిల్లుల అమ్మకాలపై ఊహించిన దానికంటే ఎక్కువ కట్ ఆఫ్ల కారణంగా భారతదేశంలో ఇన్వర్షన్ జరిగింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు కారణంగా ప్రేరేపించబడిందని తెలుస్తోంది. లిక్విడిటీలో ఈ క్షీణత కారణంగా ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ ధోరణి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ వెల్లడించారు. అయితే దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications