ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వేదికగా పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు (టోల్) విధించేలా రూపొందించిన "హార్ముజ్ జలసంధి నిర్వహణ ప్రణాళిక"కు ఇరాన్ పార్లమెంట్ భద్రతా కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది.
ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్' (IRIB) ఈ వివరాలను వెల్లడించింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నూతన ప్రణాళిక ప్రకారం..Hormuz జలసంధి భద్రత, నౌకల రాకపోకల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను ఇరాన్ మరింత కఠినతరం చేయనుంది. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ కరెన్సీ అయిన 'రియాల్' ఆధారంగా టోల్ వసూలు చేసే వ్యవస్థను ప్రవేశపెట్టడం. ఇది అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలో ఇరాన్ కరెన్సీకి ప్రాధాన్యత పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది.

అంతేకాకుండా, అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలను ఈ ప్రణాళిక స్పష్టంగా నిషేధించింది. ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు కూడా ఈ జలమార్గంలో ప్రవేశం నిరాకరించబడుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ విషయంలో చట్టపరమైన చట్రాన్ని బలోపేతం చేసేందుకు పొరుగు దేశమైన ఒమన్తో కలిసి పనిచేయాలని ఇరాన్ నిర్ణయించింది.
ఇరాన్ చర్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. హార్ముజ్ జలసంధిపై భవిష్యత్తులో అమెరికా తిరిగి పూర్తి నియంత్రణ సాధిస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ నిబంధనల వల్ల కొన్ని దేశాలు తమ నౌకలను ఉపసంహరించుకుంటున్నప్పటికీ, త్వరలోనే అమెరికా లేదా బహుళజాతి రక్షణ దళాల ద్వారా ఇక్కడ స్వేచ్ఛా రాకపోకలను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్కు ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అమెరికా భద్రతా కవచంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధిని త్వరగా యథావిధిగా తెరవకపోతే, ఆ దేశ పౌర ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్కు ఆర్థికంగా వెన్నెముక వంటి చమురు బావులు, విద్యుత్ కేంద్రాలు, వ్యూహాత్మకమైన ఖార్గ్ ద్వీపం వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలకు అందే చమురులో దాదాపు ఐదవ వంతు ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది కాబట్టి, ఇక్కడ తలెత్తే ఏ చిన్న ఉద్రిక్తత అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ఇరాన్ యొక్క పట్టుదల, అమెరికా యొక్క హెచ్చరికల మధ్య హార్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ స్పాట్గా మారింది.
More From GoodReturns

ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. బ్లాక్రాక్ అధినేత సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏంటంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. బ్యారెల్కు 150 డాలర్ల నుంచి 200 డాలర్లకు.. మక్వారీ వార్నింగ్ ఇదే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications
