Adani Stock: 84 శాతం క్షీణించిన అదానీ గ్రూప్ స్టాక్.. విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. కొన్నారా..?
Adani Stock: అదానీ గ్రూప్ కంపెనీలు ఇచ్చినన్ని లాభాలు లేదా అవి ఇచ్చే నష్టాలు ఎల్లప్పుడూ భారీగానే ఉంటాయి. అవి ఒక విధంగా ఇన్వెస్టర్ల ఊహలకు అందవు. కానీ 2023 జనవరి నుంచి గ్రూప్ షేర్లలో అనూహ్య మార్పులు మెుదలయ్యాయి.
అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. అవి తమ 52 వారాల గరిష్ఠ ధరకు చాలా దూరంగా ట్రేడింగ్ అవుతున్నాయి. ఒకప్పుడు రూ.4000గా ఉన్న అదానీ టోటల్ గ్యాస్ ఒక్కో షేరు ధర దాదాపు 84 శాతం మేర క్షీణించి నేడు రూ.642 వద్ద ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా జనవరి చివర్లో హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత కంపెనీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

కొత్త ఏడాది కేవలం 5 నెలల కాలంలోనే ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు నష్టాలను చవిచూశారు. అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ సంచన నివేదిక విడుదల చేయటానికి ముందర ఈ కంపెనీ స్టాక్స్ రూ.3900 ధరకు పైన ట్రేడవుతున్నాయి. అలాగే ఏడాది ప్రాతిపధికన కంపెనీ షేర్లు 81.88 శాతం క్షీణించాయి. ఈ స్టాక్ గత ఏడాదిలో దాదాపు 72% నష్టపోయింది. జనవరిలో ఆరోపణల తర్వాత స్టాక్ నిరంతరం పతనమవుతూనే ఉంది. గత నెలలో స్టాక్ 12 శాతం మేర నష్టపోయింది.
ప్రస్తుతం స్టాక్ 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ.620.05 రేటుకు అత్యంత సమీపంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఈ గ్యాస్ కంపెనీ షేర్లలో మాత్రం ఎలాంటి చలనం లేదు. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.2 శాతం మేర పెరిగి రూ.రూ.1,114.8 కోట్లకు చేరుకుంది. అలాగే మార్జిన్ గత ఏడాది ఇదే కాలం 13 శాతం నుంచి 17.5 శాతానికి మెరుగుపడింది.


Click it and Unblock the Notifications