Adani News: గత కొన్ని నెలలుగా అదానీ దూకుడు కొంత తగ్గించారు. అయితే కీలక వ్యాపారాల్లో ఆచితూచి తన అడుగులను ముందుకు వేస్తున్నారు. దీనికి తోడు సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఊరటతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి.
ఈ క్రమంలో అదానీ టోటల్ గ్యాస్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ పైలట్ను అహ్మదాబాద్లో ప్రారంభించినట్లు వెల్లడించింది. కంపెనీ 4000 నివాస, వాణిజ్య వినియోగదారుల కోసం గ్రీన్ హైడ్రోజన్ను సహజ వాయువుతో మిక్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ Q1FY24-25 నాటికి ప్రారంభించబడుతుందని అంచనా. రెగ్యులేటరీ అనుమతులపై ఆధారపడి గ్రీన్ హైడ్రోజన్ శాతం క్రమంగా 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వరకు పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది.

పైలట్ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, హైడ్రోజన్ మిశ్రమ ఇంధనం నగరంలోని పెద్ద ప్రాంతాలకు, అదానీ టోటల్ యెుక్క ఇతర లైసెన్స్ ప్రాంతాలకు సరఫరా చేయబడుతుందని కంపెనీ వెల్లడించింది. నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీటి ద్వారా విద్యుత్ పంపినప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజించబడుతుంది. ఈ ప్రక్రియలో వినియోగించే విద్యుత్తును పునరుత్పాదక శక్తి ద్వారా తయారు చేయబడుతుందని తెలుస్తోంది.
హైడ్రోజన్ను గ్యాస్తో కలపడం వల్ల మండే గ్యాస్లో దాని వేడి సామర్థ్యాలను కోల్పోకుండా కార్బన ఉద్గారాలు తగ్గుతాయని తెలుస్తోంది. 8 శాతం హైడ్రోజన్ మిశ్రమం కార్బన్ ఉద్గారాలను 4 శాతం తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయని అదానీ టోటల్ గ్యాస్ వెల్లడించింది. నేడు ఇంట్రాడేలో అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ మెగా ర్యాలీలో ముందుంది. ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 20 శాతం పెరిగి రూ.644.15 వద్ద అప్పర్ సర్క్యూలో లాక్ అయ్యింది. వాస్తవానికి జనవరి చివరిలో హిండెన్బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత ఈ ఏడాది స్టాక్ ధర ఏకంగా 81.85 శాతం నష్టపోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications