Adani News: అదానీ గ్రూప్ శుభవార్త.. సరికొత్త 52 వారాల గరిష్ఠానికి అదానీ పోర్ట్స్ స్టాక్..
Adani Ports: గత ఏడాది జనవరిలో భారీ షాక్ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ లిస్టెడ్ గ్రూప్ కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చాలా అదానీ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు ఊహించని రాబడిని అందిస్తూ వారిని ధనవంతులుగా మార్చేస్తున్నాయి.
అదానీ గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీ అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.1,345 వద్ద ప్రారంభమయ్యాయి. కానీ కొంత కాలం తర్వాత కంపెనీ షేర్లు ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి రూ.1,356.50కి చేరుకోవడంలో విజయం సాధించాయి. అదానీ పోర్ట్స్ షేర్ల ధరలు పెరగడం వెనుక కారణం ఒక నివేదిక ఉంది.

ఫిబ్రవరి నెలలో వార్షిక ప్రాతిపదికన కార్గో పరిమాణంలో ఏడాది ప్రాతిపదికన 33 శాతం పెరుగుదల నమోదైందని అదానీ పోర్ట్స్ నివేదించింది. స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఫిబ్రవరిలో మొత్తంగా 35.4 MMT కార్గో నిర్వహించినట్లు కంపెనీ నివేదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఫిబ్రవరి 2024) 11 నెలల వరకు కంపెనీ 382 MMT కార్గోను తన పోర్టుల్లో హ్యాండిల్ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే మాటికి ఇది 400 మిలియన్ మెట్రిక్ టన్నులను అధిగమిస్తుందని కంపెనీ భావిస్తోంది. కార్గో వాల్యూమ్లను నిర్వహించడంలో కంపెనీ ఇప్పటివరకు వార్షిక ప్రాతిపదికన 21 శాతం వృద్ధిని సాధించడంలో విజయవంతమైంది.
బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అదానీ పోర్ట్స్ షేర్లపై బుల్లిష్గా ఉంది. రానున్న కాలంలో కంపెనీ షేర్లు రూ.1,410 స్థాయికి చేరుకుంటుందని బ్రోకరేజ్ వెల్లడించింది. గత 6 నెలల్లో కంపెనీ షేర్ల ధర పెరిగింది. ఈ కాలంలో పొజిషనల్ ఇన్వెస్టర్లు 70 శాతం లాభపడ్డారు. గత ఏడాది కాలంలో అదానీ పోర్ట్స్ షేర్ ధరలు 94 శాతం పెరిగాయి. కంపెనీ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.571.35గా ఉంది.


Click it and Unblock the Notifications