Adani Ports: ఎప్పుడూ కొనటమే తప్ప అదానీ గ్రూప్ వ్యాపారాలను లేదా ఆస్తులను అమ్మటం అనే మాట ఇప్పటి వరకు మనం వినలేదు. అయితే తాజాగా కంపెనీ తన ఆధీనంలోని విదేశీ పోర్టును విక్రయించినట్లు వెల్లడించింది.
కంపెనీ అందించిన వివరాల ప్రకారం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ గురువారం తన మయన్మార్ పోర్టు విక్రయాన్ని పూర్తి చేసింది. అయితే ఈ డీల్ విలువ 30 మిలియన్ డాలర్లకు జరిగినట్లు సమాచారం. గత ఏడాది మే నెలలో మయన్మార్ పోర్టు అమ్మకం కోసం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (SPA)పై అదానీ పోర్ట్స్ సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో పాటు కొనుగోలుదారు వ్యాపారాన్ని సజావుగా నిర్వహించడం కోసం సంబంధించి కొన్ని ఆమోదాలు ఉన్నాయి. అదానీ గ్రూప్ అవసరమైన అన్నింటిని పూర్తి చేస్తే మూడు రోజుల్లో కొనుగోలు దారు డబ్బు చెల్లించాల్సి ఉంది. దీంతో మెుత్తం ఈక్విటీ వాటాలను సెల్లర్ అదానీ పోర్ట్స్ నూతన యాజమాన్యానికి బదిలీ చేసి డీల్ పూర్తి చేసింది. రిస్క్ కమిటీ అక్టోబరు 2021లో చేసిన సిఫార్సుల మేరకు అదానీ పోర్డ్స్ బోర్డు ఈ నిష్క్రమణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఈవో కరణ్ అదానీ స్పష్టం చేశారు.

అదానీ గ్రూప్కు చెందిన ఓడరేవు సంస్థ ఏప్రిల్లో అత్యధికంగా నెలవారీ కార్గో హ్యాండిల్ చేసినట్లు వెల్లడించింది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న తరుణంలో ఇనుప ఖనిజం, బొగ్గు షిప్మెంట్లు అధికంగా ఉండటం దీనికి తోడ్పడినట్లు తెలుస్తోంది. అదానీ పోర్ట్స్ ఏప్రిల్లో 32.3 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయగా ఇది గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 12.8 శాతం అధికం. కంపెనీకి భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయం అయిన గుజరాత్లోని ముంద్రా పోర్ట్తో సహా 11 ఓడరేవులను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications