Adani Ports: అదానీకి హైఫా పోర్ట్ వేడి.. పరిస్థితులు నిశితంగా పరిశీలన.. కీలకం అదే..
Adani News: ఇజ్రాయెల్ లో అలుముకున్న యుద్ధ వాతావరణం అదానీ కంపెనీపై ఆందోళనలను పెంచేస్తోంది. ఈరోజు ప్రధానంగా మార్కెట్లో అదానీ పోర్ట్స్ స్టాక్ భారీగానే క్షీణించింది.
బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్.. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ నిర్వహిస్తోంది. అదానీ నేతృత్వంలోని కన్సార్టియం జనవరిలో దీనిని 1.03 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తాజాగా అదానీ పోర్ట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే వ్యాపార కొనసాగింపు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు, ఏదైనా సంఘటనకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి మాకు వీలు కల్పిస్తుందని వెల్లడించింది.

అదానీ మెుత్తం కార్గో వ్యాపార పరిమాణంలో హైఫా పోర్టు వాటా 3 శాతంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్యానిక్ సెల్లింగ్ కి దిగటంతో స్టాక్ సోమవారం 4.8% మేర నష్టపోయింది. ఇజ్రాయెల్లో కంపెనీ ప్రధాన ఓడరేవును కలిగి ఉన్న చోట వివాదం తీవ్రతరం కావడంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. హైఫా ఇజ్రాయెల్లోని ప్రధాన ఓడరేవులలో ఒకటి. ఇక్కడ దాదాపు 99% వస్తువులు సముద్రం ద్వారా దేశంలోపలికి, బయటకు రవాణా జరుగుతుంది.
పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ శనివారం ఇజ్రాయెల్పై దశాబ్దాలలో అతిపెద్ద సైనిక దాడిని ప్రారంభించి. దీంతో ఇజ్రాయెల్ సైతం తీవ్రస్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ విమానాలు ఇప్పటికే గాజాలోని ముష్కర మూకల స్థావరాలపై వైమానిక దాడులు చేపడుతుండగా.. భూ బలగాలు పాలస్తీనా ముష్కరులచే ఆక్రమించబడిన సరిహద్దు గ్రామాలు, పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతున్నాయి.


Click it and Unblock the Notifications