Train Accident: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలో సంపన్నుడైన గౌతమ్ అదానీ ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించారు. బాధితులకు చేయూతనిచ్చేందుకు నేనున్నానంటూ తన దాతృత్వాన్ని చాటుకునే ప్రకటనను విడుదల చేశారు.
దేశంలో అత్యంత బాధాకరమైన ఘోర రైలు ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఇందులో అనేక మంది తమ దగ్గరి బంధువులను, కుటుంబసభ్యులను, తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో దాదాపు 288 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 1200 మంది గాయపడ్డారు. దీనిపై రైల్వేశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రైల్వే శాఖతో పాటు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన అమాయక పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు అదానీ తన ట్విట్టర్ ఖాతాలో రాశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన అమాయకుల పాఠశాల విద్య బాధ్యతను తాము తీసుకుంటామంటూ ట్వీట్ చేయటం ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటంతో పాటు.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించటం మనందరి ఉమ్మడి బాధ్యతని బిలియనీర్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications