Adani News: హిండెన్ బర్గ్ నివేదికలో అసలు వాస్తవం ఎంత అనే విషయాన్ని తేల్చేందుకు సెబీ దర్యాప్తును ప్రారంభించింది. దేశంలోని రాజకీయ ప్రతిపక్షాలు పట్టుతో అది సుప్రీం కోర్టులో విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల మారిషస్ ప్రభుత్వం సైతం తమ దగ్గర షెల్ కంపెనీలు లేవంటూ బదులిచ్చింది.
అదానీ గ్రూప్పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం కొన్ని వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది. ఈ వార్త వెలువడటంతో మార్కెట్లో కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం సెషన్లో అదానీ గ్రూప్ షేర్లు లాభపడ్డాయి.

అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ బీఎస్ఈలో క్రితం ముగింపు రూ.1888.05తో పోలిస్తే 3.92% పెరిగి రూ.1962కి చేరుకుంది. అయితే ఈ ఏడాది షేరు 49 శాతం పతనమైంది. మధ్యాహ్నం ట్రేడింగ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.2.22 లక్షల కోట్లకు పెరిగింది. BSEలో మొత్తం 2.24 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఇదే సమయంలో అదానీ టోటల్ గ్యాస్ మినహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ మధ్యాహ్నం సెషన్లో 4% వరకు లాభపడ్డాయి. అయితే అదానీ విల్మార్ షేర్లు 4.3% లాభపడి రూ.394.35 వద్దకు చేరుకోగా, అదానీ పోర్ట్స్ స్టాక్ 2.75% లాభపడి రూ.682.20కి చేరుకుంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ బీఎస్ఈలో మునుపటి ముగింపు రూ.861.50 నుంచి 3.54% పెరిగి రూ.892కి చేరుకుంది. అలాగే అదానీ పవర్ స్టాక్ 4.13 శాతం పెరగగా.. అదానీ ట్రాన్స్మిషన్ స్టాక్ 2.20% పెరిగి రూ.767.90కి చేరుకుంది.
చివరిగా అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ మాత్రం 5 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతోంది. ధరల అవకతవకలకు సంబంధించి నియంత్రణ వైఫల్యం ఉంటే నిర్ధారించడం సాధ్యం కాదని ప్యానెల్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి ముందు దర్యాప్తును పూర్తి చేయటానికి ఆరు నెలల సమయం కావాలని సెబీ కోరిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications