Adani: అదానీ అప్పు భారత జీడీపీలో 1.2 శాతానికి సమానమట..!
అదానీ గ్రూప్ చెల్లించాల్సిన మొత్తం అప్పులు రూ. 3.39 ట్రిలియన్లు ($41.1 బిలియన్లు) నిక్కీ ఆసియా తెలిపింది. ఈ మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో కనీసం 1 సమానమని పేర్కొంది. అదానీ గ్రూప్ ల్లో ACC, అంబుజా సిమెంట్స్, న్యూఢిల్లీ టెలివిజన్తో సహా అదానీ 10 లిస్టెడ్ గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటికి రూ.3.39 ట్రిలియన్లు అప్పు ఉన్నట్లు వివరించింది.

4.8 ట్రిలియన్ రూపాయలు
10 గ్రూప్ కంపెనీలు మొత్తం ఆస్తులలో 4.8 ట్రిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నాయని తెలిపింది. అయితే పెట్టుబడిదారులు బయటి అప్పుల గురించి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేసింది. అదానీ గ్రూప్లో ప్రైవేట్గా ఆధీనంలో ఉన్న అనేక కంపెనీలు ఉన్నాయి, అంటే దాని మొత్తం రుణ భారం ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషించింది.

రూ. 273 లక్షల కోట్లు
అక్టోబరు చివరి నాటికి భారతదేశ జీడీపీ రూ. 273 లక్షల కోట్లుగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటించింది. దీని ఆధారంగా అదానీ గ్రూప్ భారత జీడీపీలో 1.2 శాతం రుణం తీసుకున్నట్లు నిక్కీ ఆసియా తన నివేదికలో పేర్కొంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ స్టాక్ ల్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదానీ గ్రూప్ లోని ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్లో సగానికి పైగా నష్టపోయాయి. అదానీ తీసుకొచ్చిన రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)ను కూడా ఉపసంహరించుకుంది. అయితే హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.

రూ.80,000 కోట్లు
ఈ సమయంలో అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలు, అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఒత్తిడులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఎల్ఐసీ స్టాక్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ఆ తర్వాత ఎస్బీఐ, పంజాబ్ నేషనల్, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ ఒత్తిడులను ఎదుర్కొన్నాయి. దీనిపై ఆర్బీఐ స్పందిస్తూ బ్యాంకింగ్ రంగం నిలకడగా ఉందని పేర్కొంది. ఇటీవలి CLSA నివేదిక ప్రకారం, భారతీయ బ్యాంకులు అదానీ గ్రూప్కు దాదాపు 80,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చాయి.

ఈక్విటీ నిష్పత్తి
అదానీ గ్రూప్కు చెందిన 10 కంపెనీల సంయుక్త ఈక్విటీ నిష్పత్తి కేవలం 25 శాతంగా ఉందని నిక్కీ ఆసియా పేర్కొంది. ప్రత్యేకించి అదానీ గ్రీన్ ఎనర్జీ ఈక్విటీ నిష్పత్తి కేవలం 2 శాతం ఉందని నివేదించింది. ఈక్విటీ నిష్పత్తి ఒక కంపెనీ ఎంత రుణంపై ఆధారపడి ఉందో చూపిస్తుంది.


Click it and Unblock the Notifications