Adani News: అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక చాలా నెలలు అదానీ గ్రూప్ కంపెనీలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపైనే దర్యాప్తు పూర్తి కాకుండానే మరో రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తోంది.
అస్పష్టమైన మారిషస్ Opaque ఫండ్స్ ద్వారా అదానీ కుటుంబం భారతదేశంలోని అదానీ గ్రూప్ ఈక్విటీల్లో మిలియన్ల కొద్ది డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) గురువారం ఒక కథనంలో తెలిపింది. దీనికి బహుళ టాక్స్ హెవెన్స్, అదానీ గ్రూప్ అంతర్గత ఈమెయిల్స్ ద్వారా సేకరించిన సమాచారం దీనికి సాక్ష్యమని సంస్థ పేర్కొంది.

ఆఫ్షోర్ సంస్థల ద్వారా అదానీ స్టాక్లను కొనుగోలు చేసి విక్రయించిన కనీసం రెండు కేసులను తమ దర్యాప్తులో కనుగొన్నట్లు లాభాపేక్షలేని మీడియా సంస్థ OCCRP తెలిపింది. ఈ కథనం అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక విడుదలైన ఎనిమిది నెలలకు తాజాగా బయటకు వచ్చింది. గతంలో హిండెన్ బర్గ్ నివేదికను దురుద్దేశ పూరితమైనదిగా, నిరాధారమైనదిగా అదానీ గ్రూప్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో రిపోర్టు తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ల క్యాప్ జనవరి తర్వాత 150 బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది. అయితే ఇటీవల గ్రూప్ తన అప్పుల భారాన్ని కొంత తగ్గించుకోవటం, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించటం వంటి పనులతో ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగి స్టాక్స్ లాభపడ్డాయి. అయితే ఇదంతా మూనాళ్ల ముచ్చటిగా మారిపోతుందేమోనని అనిపిస్తోంది. అదానీ గ్రూప్ ఇప్పటి వరకు ఈ నివేదికపై ఎలాంటి ప్రకటన లేదా స్పందన చేయలేదు. బిలియనీర్ గౌతమ్ అదానీని హిండెన్బర్గ్ నివేదిక గతంలో తీవ్రంగా దెబ్బతీయగా.. మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications