మళ్లీ ఇబ్బందులో చిక్కుకున్న అదాని గ్రూప్.. రూ.23 కోట్ల జరిమానా విధించిన ఆదాయపు పన్ను శాఖ

భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్‌కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రెండు వేర్వేరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ. 23.07 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా ఉత్తర్వులను కంపెనీ అక్టోబర్ 1, 2025న స్వీకరించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తామని, వీటి ప్రభావం తమ ఆర్థిక కార్యకలాపాలపై ఉండదని స్పష్టం ACC చేసింది.

ఈ జరిమానాలు ACC కంపెనీ అదానీ గ్రూప్‌లో విలీనం కానున్న కంటే ముందు కాలానికి సంబంధించినవి. ఆదాయపు పన్ను శాఖ 2015-16, 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరాలకు వేర్వేరుగా జరిమానాలు విధించింది.మొదటి జరిమానా (అసెస్‌మెంట్ ఇయర్ 2015-16) కాలానికి సంబంధించినది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ACC.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 49.25 కోట్ల ఖర్చును క్లెయిమ్ చేసింది. కానీ ఈ ఖర్చులను శాఖ అంగీకరించలేదు. ఫలితంగా ఆదాయాన్ని తప్పుగా చూపించిందని నిర్ణయించి, సంబంధిత పన్ను బాధ్యతపై రూ. 14.22 కోట్ల జరిమానా విధించింది. ఈ చర్యను "తప్పుడు ఆదాయ వివరాల సమర్పణ" కింద వర్గీకరించారు.

Adani Group Gautam Adani Adani fine Income Tax Department Adani company penalty 23 crore fine Adani news Adani latest update Adani tax issue Adani financial irregularities Adani Group investigation Adani stock news Adani business news Indian Income Tax Department Adani controversy Adani Group setback Adani compliance issue Adani tax penalty Indian corporate news Adani latest controversy 23

ఇక రెండవ జరిమానా (అసెస్‌మెంట్ ఇయర్ 2018-19) విషయానికి వస్తే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ACC.. రూ. 12.79 కోట్ల ఖర్చును క్లెయిమ్ చేసినప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ దానిని తిరస్కరించింది. దీని ఫలితంగా ఆదాయం తక్కువగా చూపించిందని పేర్కొంటూ రూ. 8.85 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా సంబంధిత పన్ను బాధ్యతలో 200 శాతం రేటుతో విధించబడింది.

ACC లిమిటెడ్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే.. ఈ రెండు జరిమానా ఉత్తర్వులను కంపెనీ అప్పీల్ చేస్తామని తెలిపింది. నిర్ణీత గడువులోపు ఆదాయపు పన్ను కమిషనర్ వద్ద అప్పీల్ ఫైల్ చేస్తామని.. అలాగే జరిమానా డిమాండ్లపై స్టే (stay) కోరుతామని తెలిపింది. ఈ జరిమానాలు తమ రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని ACC స్పష్టం చేసింది.

ACC లిమిటెడ్ అనేది భారతదేశంలో ప్రముఖ సిమెంట్ కంపెనీ. ఇది అదానీ సిమెంట్స్‌కి అనుబంధ సంస్థ, కాగా అంబుజా సిమెంట్స్.. ACCలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్‌లో, అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కి చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్, ACC లిమిటెడ్‌ను 6.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 51,000 కోట్లు) విలువైన ఒప్పందంలో కొనుగోలు చేసింది.

ACC తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 21,762 కోట్లు.అలాగే సిమెంట్ అమ్మకాలు 39 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. భారతదేశంలోని నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ACC లాంటి సిమెంట్ దిగ్గజాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఈ జరిమానాలు ACC.. Adani Group లో విలీనం కానున్న కంటే ముందు కాలానికి సంబంధించినప్పటికీ, దేశంలోని పెద్ద పారిశ్రామిక సమూహం అయిన అదానీ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ చర్య పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో అదానీ గ్రూప్‌పై పలు నియంత్రణ సంస్థల దృష్టి ఉన్న నేపథ్యంలో ఈ తాజా జరిమానా వార్త మరోసారి చర్చల్లో నిలిచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+