Adani Ports: గడచిన దశాబ్ధకాలంగా అదానీ గ్రూప్ దేశంలోని వివిధ కీలక రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియాకు కీలకమైన రంగాలు, దేశాల్లో సైతం గౌతమ్ అదానీ తన వ్యూహాత్మక పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ తన వ్యాపారాన్ని దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్ మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో మరిన్ని ఓడరేవులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అదానీ గ్రూప్ పోర్ట్స్ వ్యాపార విస్తరణ చర్య భారత్ను వ్యాపార కేంద్రంగా మార్చడంతో పాటు.. చైనా ఆధిపత్యానికి సవాలు విసురుతుంది.

పేలవమైన షిప్పింగ్ కనెక్టివిటీ కారణంగా భారతదేశ సముద్ర వాణిజ్యం సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న అవాకాశాలను అందిపుచ్చుకోవాలని సౌత్-మిడిల్ ఈస్ట్లలో అదానీ పోర్ట్స్ నిర్ణయించింది. అలాగే మార్కెట్ క్యాప్ పరంగా అదానీ పోర్ట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ ఆపరేటర్. కంటైనర్ ట్రాఫిక్ పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో తూర్పు నుంచి పడమర వరకు మొత్తం సరఫరా గొలుసులో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మార్చడానికి తాము కృషి చేస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ స్పష్టం చేశారు.
అదానీ గ్రూప్ తన వృద్ధి ప్రణాళికలను వేగంగా పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ కొనుగోలు డ్రైవ్ వచ్చింది. గత ఏడాది కాలంగా అదానీ పోర్ట్స్ తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తోంది. డా నాంగ్లో గ్రీన్ఫీల్డ్ అభివృద్ధికి వియత్నామీస్ ప్రభుత్వం నుంచి అదానీ పోర్ట్స్ ఇప్పటికే "సూత్రప్రాయంగా ఆమోదం" పొందింది. దీని విలువ 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. దీనికి తోడు ఇజ్రాయెల్లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ ఓడరేవులను కూడా అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications