Adani Group: భారతీయ బిలియనీర్ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వరుసగా ఎదురుదెబ్బలతో సతమతమౌతున్నారు. పవర్ నుంచి ఎయిర్ పోర్ట్స్ వరకు వివిధ విదేశీ వ్యాపారాలకు ఎదురవుతున్న తలనొప్పులు వ్యాపారంలో ముందుకు సాగుకుండా అడ్డుకుంటున్నాయి. హిండెన్బర్గ్ 2023లో ఆరోపణల తర్వాత అదానీకి కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి.
అదానీ గ్రూప్కి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదానీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ దీనికి సంబంధించిన వార్తలు నేడు వెలువడ్డాయి. 2024 డిసెంబరులో గౌతమ్ అదానీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం నిర్ణయం తీసుకోబడింది.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే నేతృత్వంలోని ప్రభుత్వం కంపెనీ స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించిందని, దీని కారణంగా అదానీ ఒప్పందం రద్దు చేయబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే 2024లో ద్వీపంలోని వాయువ్య ప్రాంతంలో ఇంకా నిర్మించని అదానీ పవన విద్యుత్ కేంద్రం నుంచి కిలోవాట్కు 0.0826 డాలర్ల చొప్పున విద్యుత్తును కొనుగోలు చేయడానికి మునుపటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిందని, ప్రాజెక్టును రద్దు చేయలేదని సమాచారం.
మొత్తం అదానీ ప్రాజెక్టును సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ద్వీప దేశం. అదానీ ప్రతిపాదన ఖర్చులో దాదాపు మూడింట రెండు వంతుల ధరకే చిన్న రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు విద్యుత్తును అందిస్తున్న నేపథ్యంలో అదానీ డీల్పై వ్యతిరేకత వెల్లువెత్తింది. మన్నార్-పూనెరిన్ తీరప్రాంతాల్లో అదానీ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కూడా పర్యావరణ సమస్యల కారణంగా సుప్రీంకోర్టులో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీల్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
లంచం చెల్లింపులు చేసి ఈ లావాదేవీలను అమెరికా పెట్టుబడిదారుల నుండి దాచిపెట్టారనే ఆరోపణలతో అదానీపై నవంబర్ 19న అమెరికాలో అభియోగం మోపబడింది. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా అదానీ గ్రూప్ కొట్టిపడేసింది. అదానీ ప్రస్తుతం ఎనర్జీ ట్రాన్స్ మిషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, పవర్, బొగ్గు, ఎయిర్ పోర్ట్స్, సిమెంట్, పోర్ట్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా వంటి అనేక వ్యాపారాల్లోకి విస్తరించింది. శ్రీలంకలో 442 మిలియన్ డాలర్ల విద్యుత్ ప్రాజెక్టుకు అదానీ ఆమోదం 2023లో పొందగా ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటూ అడ్డంకులను కలిగిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications