Adani Group: ఒక్కరోజులు ఓడలు బండ్లు అవుతాయనే సామెత మనందరం వినే ఉంటాం. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి కూడా చూడబోతే అలాగే కనిపిస్తోంది. అవును నిన్న ఒక్కరోజే అదానీ కంపెనీలు ఏకంగా వేల కోట్ల ఇన్వెస్టర్ల ధనాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. ఈరోజు కూడా మార్కెట్లు కొంత డౌన్ ట్రెండ్ లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు సైతం భారీగా క్షీణించాయి.

వేల కోట్లు ఆవిరి..
భారత స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్కింగ్ వైపు మెుగ్గుచూపుతున్నారు. దీంతో కంపెనీ షేర్లు భారీగా నష్టాలను చవిచూడవలసి వచ్చింది. ఈ క్రమంలో గ్రూప్ లోని మెుత్తం 10 కంపెనీల విలువ ఏకంగా రూ.66,500 కోట్ల మేర తగ్గింది. కంపెనీల వ్యాల్యూయేషన్లో ఇంత భారీ పతనం అది కూడా ఒక్కరోజులోనే జరగటం ఇన్వెస్టర్లకు నిద్రలేకుండా చేస్తోంది.

అదానీ ఎంటర్ప్రైజెస్..
గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు దారుణమైన పతనాన్ని చూశాయి. నిన్న గరిష్ఠంగా షేర్ 8 శాతం వరకు క్షీణించి రూ.27,800 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఈరోజు మధ్యాహ్నం 12.52 గంటల సమయానికి స్టాక్ రూ.28.75 క్షీణించి రూ.3,618.15 వద్ద ట్రేడ్ అవుతోంది.

అదానీ టోటల్ గ్యాస్..
అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర సైతం నిన్న 4% వరకు క్షీణించి రూ.3490.70కి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో స్టాక్ రూ.46.20 మేర క్షీణించి రూ.3,610.20 వద్ద కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,300 కోట్లు తగ్గింది. అలాగే అదానీ పోర్ట్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ నిన్న దాదాపుగా ఈ సమయానికి రూ.6,000 కోట్ల మేర క్షీణించింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ &అదానీ ట్రాన్స్మిషన్..
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ అండ్ అదానీ పవర్ మార్కెట్ క్యాప్ నిన్న వరుసగా రూ.5,000 కోట్ల మేర ఆవిరైపోయింది. ఈరోజు మధ్యాహ్నం అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ రూ.17.40 క్షీణించి రూ.1,877.80 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే అదానీ ట్రాన్స్ మిషన్ స్టాక్ ధర రూ.64.15 మేర తగ్గి రూ.2,587.85 వద్ద ఉంది. ఇదే సమయంలో అదానీ పవర్ కంపెనీ షేర్ ధర రూ.275.75 స్థాయి వద్ద ఇంట్రాడేలో ట్రేడవుతోంది.

అదానీ విల్మర్..
ఐపీవోగా వచ్చిన అదానీ విల్మార్ స్టాక్ సైతం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా నిన్న 4 శాతం మేర క్షీణించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.25,000 కోట్ల మేర తరిగిపోయింది. ఈ క్రమంలో కంపెనీ స్టాక్ ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఏకంగా 2 శాతానికి పైగా లాభపడి రూ.583 వద్ద ట్రేడవుతోంది. గ్రూప్ కంపెనీలో విల్మర్ ఒక్కటి మాత్రమే లాభంలో కొనసాగటం విశేషం.

ఇతర కంపెనీలు..
అదానీ గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసిన వివిధ కంపెనీల షేర్లు సైతం నిన్న నష్టాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్, NDTV కంపెనీ షేరు సైతం పతనాన్ని నమోదు చేశాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications