ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి.. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడి ఇదే.

విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే 10 సంవత్సరాలలో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధన వ్యాపారాలు, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడులలో ఒకటిగా భావించబడుతోంది.

కరణ్ అదానీ మాట్లాడుతూ..ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు, లాజిస్టిక్స్, సిమెంట్, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో రూ. 40 వేల కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇకపై వచ్చే దశాబ్దంలో దీన్ని రూ. 1 ట్రిలియన్ కు విస్తరించబోతున్నామని తెలిపారు. ఈ పెట్టుబడులు లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు.

Adani Group investment 1 lakh crore AP investment Andhra Pradesh investments Adani projects AP AP infrastructure development Adani ports investment renewable energy AP AP economic growth industrial investments Andhra Pradesh Adani expansion plan mega investments India AP development projects Adani Group news CII Summit AP business investments Andhra Pradesh 1

అదానీ గ్రూప్ తాజాగా గూగుల్‌తో కలిసి భారతదేశంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు (AI) హబ్ నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్లు డాలర్లు (రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. దీనిలో భాగంగా 1 గిగావాట్ శక్తి సామర్థ్యంతో భారీ డేటా సెంటర్ క్యాంపస్ కూడా నిర్మించబడుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ వెలుపల గూగుల్ యొక్క అత్యంత పెద్ద AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ కానుంది. విశాఖపట్నం టెక్ పార్క్ మా అత్యంత పెద్ద, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. గూగుల్‌తో కలిసి దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద హైటెక్, స్థిరశీల కేంద్రంగా మార్చబోతున్నామని కరణ్ అదాని తెలిపారు.

సదస్సులో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై కరణ్ అదానీ ప్రశంసలు కురిపించారు. భారత పారిశ్రామిక అభివృద్ధిని పునర్నిర్వచించిన దార్శనిక నాయకుడు అని ఆయన నాయుడిని అభివర్ణించారు. అలాగే ఐటీ & పరిశ్రమల మంత్రి నారా లోకేష్ ను నవయుగ నాయకుడు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే దూరదృష్టి కలిగిన మంత్రిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ రాష్ట్రంగా మార్చడంలో లోకేష్ పాత్ర కీలకమని కరణ్ అదానీ అన్నారు.

ఈ సంవత్సరం భాగస్వామ్య సదస్సులో 100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల సంస్థలు పాల్గొని భారీ పెట్టుబడి ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా మొత్తం రూ. 10 లక్షల కోట్ల (రూ. 10 ట్రిలియన్) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్ టెక్నాలజీ, రక్షణ తయారీ, పర్యాటకం రంగాలపై దృష్టి పెట్టనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+