అదానీ ఎంటర్ప్రైజెస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (QIP), ఇతర పద్ధతుల ద్వారా రూ.16,600 కోట్ల వరకు సేకరించేందుకు ఆమోదించింది. మే 28న జరిగిన అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ల బోర్డ్, ఈక్విటీ షేర్లు, ఇతర అర్హత కలిగిన సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా లేదా వాటి కలయిక ద్వారా మొత్తం రూ.16,600 కోట్ల విలువైన సంస్థాగత ప్లేస్మెంట్ ద్వారా నిధుల సమీకరణకు ఆమోదం తెలిపింది.
(QIP) లేదా ఇతర అనుమతించదగిన మోడ్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతలలో నిధుల సేకరణ ఉంటుంది అదానీ ఎంటర్ప్రైజెస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, 2024 జూన్ 24న సోమవారం జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యుల ఆమోదంతో సహా అవసరమైన ఆమోదాల రసీదు, ఇతర నియంత్రణ మరియు చట్టబద్ధమైన అనుమతులకు లోబడి నిధుల సేకరణ జరుగుతుంది.

ఉదయం 11:45 గంటలకు BSEలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 0.32% పెరిగి ఒక్కొక్కటి రూ.3,298.55 వద్ద ట్రేడవుతున్నాయి. గత సంవత్సరం కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ నిధుల సేకరణకు ఆమోదం తెపింది. క్యూఐపీ విధానంలో నిధులు సేకరించింది. అయితే అప్పుడే హిండెన్ బర్గ్ నివేదిక రావడంతో అదానీ స్టాక్ ల్లో తీవ్ర ఒత్తిడి కనిపించింది. దీంతో అదానీ ఎంటర్ప్రైజెస్ నిధుల సేకరణను రద్దు చేసింది. ఆ తర్వాత అదానీ స్టాక్ లు సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
దీంతో మరోసారి నిధుల సేకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈసారి పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications