adani: అదానీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఒకటి వెనకాల మరోటి దెబ్బ పడుతూనే ఉంది. హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం గ్రూపు కంపెనీల స్టాక్స్ తీవ్ర నష్టాల్లోకి జారుకోవడం తెలిసిందే. తద్వారా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 5 లో ఉండాల్సిన గౌతమ్ అదానీ.. 25 వ స్థానానికి పడిపోయారు. ఈ హీట్ చల్లారక ముందే వికీపీడియా సైతం ఇటీవలే విరుచుకుపడింది. తాజాగా ఇప్పటికే ఓ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

చట్టపరమైన చిక్కులతో..
మహారాష్ట్రలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ (CGU)ను ఏర్పాటు చేయాలని CK బిర్లా గ్రూపులో భాగమైన ఓరియంట్ సిమెంట్ భావించింది. అందుకు గాను అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ (APML)తో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. దానినే ఇప్పుడు రద్దు చేసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు అప్ డేట్ ఇచ్చింది. చట్టరీత్యా ఉన్న చిక్కుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

క్లియరెన్స్ లో విఫలం:
CGU ఏర్పాటు కోసం అవసరమైన భూమిని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC) ద్వారా సబ్ లీజుకు ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించిన క్లియరెన్స్ లు పొందడంలో APML విఫలమైనట్లు ఓరియంట్ పేర్కొంది. అందువల్ల ఈ ప్రాజెక్టులో ముందుకు సాగలేమని అదానీ కంపెనీ అభ్యర్థించినట్లు వెల్లడించింది. దానికి తోడు ఒప్పందం ప్రకారం నిర్ణయించిన గడువు సైతం పూర్తి అయినందున తాము అందుకు అంగీకరించినట్లు చెప్పింది.

డీల్ రద్దు:
మహారాష్ట్రలోని తిరోడాలో CGUని నెలకొల్పేందుకు సెప్టెంబర్ 2021లో APMLతో ఓరియంట్ సిమెంట్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం గోండియా జిల్లాలోని సుమారు 35 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించింది. దానిని ఉపయోగించుకోవడం కోసం చట్టబద్ధ లీజుదారు అయిన APMLతో కలిసి ముందుకు సాగాలని భావించింది. కానీ సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి అనుమతులు పొందలేకపోవడంతో ఈ డీల్ రద్దు చేసుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications