టైమ్స్ మోస్ట్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ జాబితాలో గౌతమ్ అదానీ
టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్సియల్ పీపుల్ 2022 (అత్యంత పలుకుబడి కలిగినవారు) వ్యక్తుల్లో బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు సోమవారం టైమ్ మేగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2022 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అడ్వోకేట్ కరునా నూదీ కూడా ఉన్నారు.
ఈ జాబితాలో అమెరికా అద్యక్షులు జోబిడెన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనీస్ ప్రెసిడెంట్ జీ- జిన్పింగ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్ వోన్ డెర్ లీయెన్, టెన్నిస్ ఐకాన్ రఫెల్ నాడల్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, మీడియా కింగ్ ఓర్పా విన్ఫ్రే తదితరులు ఉన్నారు.
ఒకప్పుడు ప్రాంతీయ వ్యాపార సంస్థగా ఉన్న అదానీ గ్రూప్ సంస్థ ఇప్పుడు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సోలార్, థర్మల్ పవర్, వినియోగదారుల వస్తువుల రంగాలలో విస్తరించడం ద్వారా భారత్లోని దిగ్గజ గ్రూప్ల్లో ఒకటిగా నిలిచిందని టైమ్ పేర్కొంది.