ఏసర్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా సోనుసూద్
కరోనా వైరస్ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందుకున్న నటుడు సినిమా విలన్, రియల్ హీరో సోనూసూద్ లాప్టాప్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఏసర్ ఇండియా సంస్థ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏసర్లోని సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూసూద్ కీలకపాత్ర పోషిస్తారని ఏసర్ ఇండియా తెలిపింది.
సైబర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఇవ్వకున్నా.. బిలియనీర్ కూతురు అకౌంట్ నుండి డబ్బులు డ్రా
మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ సాంకేతికతతో ఏసర్ ఇండియా ఆకట్టుకుందని సంస్థ తెలిపింది. తమ సంస్థకు సోనసూద్ వంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించేందుకు ఏసర్ ఇండియా కృషి చేస్తోందని ఎండీ హరీష్ కోహ్లి అన్నారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ పరంగా ఏసర్ కీరోల్ పోషిస్తుందన్నారు.
సోనూసూద్ తమ బ్రాండును ప్రమోట్ చేయడం సంతోషకరమని ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుధీర్ గోయల్ అన్నారు. ఏసర్ ఇండియా దాదాపు 45 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రపంచవ్యాప్తం దిగ్గజ కంపెనీల జాబితాలో ఉంది. 160 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.