IT News: ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ద్రవ్యోల్బణం తగ్గుదలపై గ్రోత్ ఆశలు పెరిగాయి. ఈ క్రమంలో టెక్ పరిశ్రమకు మంచి రోజులు తిరిగి వస్తున్నాయని జాబ్స్ పెరుగుతాయని ఆశలు చిగురించాయి. అయితే ఈ క్రమంలో అమెరికా కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టెక్ దిగ్గజం యాక్సెంచర్ టెక్ కంపెనీలకు మార్గనిర్థేశాన్ని చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రధాన భారతీయ టెక్ కంపెనీలైన టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో లాభపడ్డాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం యాక్సెంచర్ నాల్గవ త్రైమాసిక నివేదించిన తర్వాత ఈ పరుగు నమోదైంది. వాస్తవానికి స్థూల ఆర్థిక వాతావరణం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో మెరుగుదల కారణంగా యాక్సెంచర్ తన వార్షిక ఆదాయ వృద్ధి అంచనాను 2025కి 3-6%కి పెంచినట్లు ఫలితాల ప్రకటన సమయంలో వెల్లడించింది. HCL టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

యాక్సెంచర్ మార్కెట్ అంచనాకు అనుగుణంగా రిపోర్టింగ్ త్రైమాసికంలో 16.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన ఆదాయం 2.6 శాతం పెరిగింది. కన్సల్టింగ్ ఎట్టకేలకు వృద్ధిలోకి రావడంతో అవుట్సోర్సింగ్ సేవలు 4.6 శాతం విస్తరించాయి. ఈ క్రమంలో మొత్తం బుకింగ్లు సంవత్సరానికి 21.1 శాతం వృద్ధి చెంది 20.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ బుకింగ్లు 11.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇందులో భారీ వృద్ధి ఉన్నట్లు నువామా వెల్లడించింది.
యాక్సెంచర్ ఆదాయాలు, FY25 మార్గదర్శకత్వం పర్యావరణంలో ఎలాంటి భౌతిక మార్పును సూచించడం లేదని బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. రాబోయే 12 నెలల్లో సేంద్రీయ వృద్ధి మెరుగుపడుతుందని వారు అంచనా వేస్తున్నారు. గత మూడు నుండి నాలుగు నెలల్లో రన్-అప్ తర్వాత ఈ రంగానికి ఉపశమనం కలిగించే సంకేతంగా బ్రోకరేజ్ పేర్కొంది. ఈ క్రమంలో బ్రోకరజే సంస్థ నోమురా భారతీయ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, eClerx సర్వీస్ షేర్లలకు కొనుగోలు రేటింగ్ అందించింది.
దీని ప్రకారం సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోని టెక్ పరిశ్రమలోని కంపెనీలపై ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించనున్నారు. నిపుణులు సైతం ఐటీ కంపెనీల షేర్లు టేకాఫ్ అవటానికి వడ్డీ రేట్ల తగ్గింపు మంచి సంకేతంగా ట్రిగర్ అవుతుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన టెక్ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు ఓ లుక్కేసి ఉంచటం ముఖ్యమైన అంశం.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications