Reliance: తాజాగా అనేక కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలను అందుకోవటంలో మిస్ అయ్యింది. అయితే కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ వల్ల లాభాలు తగ్గాయి. అయితే ఇటీవల కొన్నినెలల కిందట ముఖేష్ అంబానీ నుంచి బాధ్యతలు అందుకున్న వారసులు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలు తండ్రికి గట్టి పోటీగా నిలిచారు.

రిలయన్స్ లాభాలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వెలువడ్డాయి. లాభాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.2 శాతం క్షీణించాయి. రెండవ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.13,656 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం 34 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది నిపుణుల అంచనాల కంటే ఎక్కువ కావటం గమనార్హం.

రిలయన్స్ రిటైల్..
తండ్రి నుంచి రిలయన్స్ రిటైల్ పగ్గాలు అందుకున్న ఇషా అంబానీ అనతి కాలంలోనే కంపెనీని మంచి లాభాల బాట పట్టించారు. వ్యాపార నిర్వహణ విషయంలో తండ్రి ముఖేష్ కు ఏమాత్రం తగ్గకుండా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు ఆమె. రిలయన్స్ రిటైల్ సెప్టెంబర్ త్రైమాసిక లాభం 36 శాతం పెరిగి రూ.2,305 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,695 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో రిలయన్స్ రిటైల్ ఆదాయం 42.8 శాతం పెరిగి రూ.64,936 కోట్లకు చేరుకుంది. ఇది గతంలో కంటే దాదాపు రూ.20,000 కోట్లు అధికం. నూతన సాంకేతికతతో కస్టమర్లకు కంపెనీ చేరువవుతోంది.

రిలయన్స్ జియో..
4Gతో అరంగేట్రం చేసి స్వదేశీ టెక్నాలజీతో 5Gకి విస్తరించింది రిలయన్స్ జియో. దేశ టెలికాం రంగంపై జియోది చెరగని ముద్ర. దీని బాధ్యతలు అందుకున్న ఆకాష్ అంబానీ కంపెనీలు అద్బుతమైన లాభాల్లో నడిపిస్తున్నారు. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జియో లాభం ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగింది. రిలయన్స్ జియో గత సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,528 కోట్ల లాభాన్ని నమోదు చేయగా.. ఇప్పుడు రూ.4,518 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రిలయన్స్ జియో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.22,521 కోట్లకు చేరుకుంది.

జియో 5G WiFi సర్వీసెస్..
జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ జియో ట్రూ 5G పైలట్ బీటా ట్రయల్ను చెన్నై, నాథ్ద్వారా నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య కేంద్రాలతో పాటు ఎక్కువ మంది ప్రయాణించే ప్రాంతాల్లో జియో 5G వైఫై సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆకాష్ అంబానీ అక్టోబర్ 22న ప్రకటించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications