Aadhar free update: దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరి ధ్రువపత్రంగా మారిపోయింది. బయోమెట్రిక్, ఐరిస్ తో పాటు చిరునామా, మొబైల్ నంబర్ సహా అన్ని పూర్తి వివరాలు ఒకేచోట సమర్పించగలిగే అవకాశం కల్పిస్తోంది. అందుకే దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రం.. ప్రతి 10 ఏళ్లకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని నిబంధన విధించింది.
ఆధార్ కార్డులు జారీ చేయబడి 10 ఏళ్లు పూర్తైన వారు గుర్తింపు మరియు చిరునామా పత్రాలతో తమ వివరాలను రీవాలిడేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయించుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఇప్పటికే ఎన్నోసార్లు గడువు తేదీని పొడిగిస్తూ వచ్చి, ఎట్టకేలకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా నిర్ణయించింది. దీనికి సుమారు వారం రోజులే సమయం ఉండటంతో ప్రజలు త్వరపడాలని కోరుతోంది.

ఉచిత ఆధార్ అప్డేట్ గడువు ముగిసిన తర్వాత ఏదైనా వివరాల మార్పుల కోసం UIDAI 50 చొప్పున రుసుమును వసూలు చేస్తుంది. కాగా ఈ ఉచిత సేవ ప్రత్యేకంగా 'myAadhaar' పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుందని చెబుతోంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే OTP ద్వారా లాగిన్ కావాలి. తరువాత కనిపించే ప్రొఫైల్ పేజీలో ఉన్న గుర్తింపు మరియు చిరునామా వివరాలు సరైనవని భావిస్తే ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే అందుబాటులోని ఇతర గుర్తింపు మరియు చిరునామా పత్రాలను ఎంచుకుని వాటి ఆధారంగా తప్పులను సరిదిద్దుకోవాలి.
ఎంచుకున్న పత్రాలను అప్లోడ్ చేసిన అనంతరం రివ్యూ చేసి, సమ్మతిని తెలియజేయండి. ఈ ప్రాసెస్లో ఏవిధమైన సమస్య ఎదురైనా 1947 నంబర్కు కాల్ చేసి UIDAI ఏజెంట్ సహాయం తీసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications