aadhar: దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరైంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఏ పని జరగాలన్నా ధృవీకరణ కోసం దీనినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒకవేళ ఏవైనా తప్పులు దొర్లినా సులభంగా సరిచేయించుకునే వీలుండటం వల్ల ఇది అత్యంత ప్రజాధరణ పొందింది. బతికి ఉన్న ప్రజలకు సరే, మరి వ్యక్తి మరణించిన పక్షంలో వారి ఆధార్ ఏమౌతుంది ?

నిబంధనలు రూపొందుతున్నాయ్..
మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయడానికి త్వరలోనే ఓ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కలిసి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు ప్రముఖ మీడయా సంస్థ తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దీన్ని తయారు చేయనున్నట్లు వెల్లడించింది.

మరణ ధృవీకరణకూ..
చనిపోయిన వారి సమాచారాన్ని ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సిన విధంగా ఈ విధానం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వారి అనుమతితో మాత్రమే డీయాక్టివేషన్ జరుగుతుందని మీడియా నివేదిక పేర్కొంది. జనన ధృవీకరణ పత్రంలో ఇప్పటికే ఆధార్ లింకింగ్ జరుగుతుండగా.. మరణ పత్రంలోనూ దీన్ని అనుసరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆధార్ నంబర్ల డీయాక్టివేషన్ మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేదు.

త్వరగా అప్ డేట్ చేసుకోండి:
ప్రస్తుత చట్టం ప్రకారం ఆధార్ తీసుకున్న కనీసం 10 ఏళ్లకు ఒకసారి సపోర్టింగ్ పత్రాల ద్వారా ఆయా వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై పౌరులను UIDAI ఇటీవల అప్రమత్తం చేసింది. ఇందుకోసం మార్చి 15 నుంచి జూన్ 14 వరకు రుసుము చెల్లించకుండా వివరాలు అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ రెటీనా, వేలిముద్ర, ఫొటోను ఆధార్ నమోదు కేంద్రాల్లో చేసుకోవాల్సి ఉండగా.. మిగతా వాటికి ఆన్ లైన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications