ఎయిర్బస్ A320 విమానాలపై తక్షణ భద్రతా తనిఖీలు ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రయాణ షెడ్యూల్పై పెద్దగా ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA), ఎయిర్బస్ సూచనల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్లైన్స్ ఈ సాంకేతిక అప్డేట్ పనులు చేపట్టగా.. కొంతమంది ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. అయితే ఏ ఫ్లైట్ కూడా రద్దు కాలేదని, కేవలం కొన్ని మార్గాల్లో స్వల్ప ఆలస్యాలు ఉండవచ్చని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే తమ A320 విమానాలలో సగానికి పైగా సాఫ్ట్వేర్ రీసెట్ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలిన వాటిని నిర్ణీత సమయానికి చేర్చగలమనే నమ్మకం వ్యక్తం చేసింది.
ఈ అత్యవసర చర్యల వెనుక కారణం ఇటీవల ఒక A320 విమానంలో జరిగిన సంఘటన. ప్రయాణ సమయంలో పైలట్ నియంత్రణ లేకుండానే విమానం ఆకస్మికంగా దిగువకు దూసుకెళ్లిన ఈ ఘటనపై పరిశీలన జరపగా.. ఎలక్ట్రానిక్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (ELAC) పనిచేయకపోవడం ప్రధాన కారణంగా గుర్తించారు. తీవ్రమైన సూర్య వికిరణం ప్రభావం వల్ల విమాన నియంత్రణకు అవసరమైన కీలకమైన డేటా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రిపోర్టుల్లో తేలింది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కమాండ్ లేని లిఫ్ట్ చలనం జరిగి, అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చని EASA హెచ్చరించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ను తప్పనిసరి చేసింది.

కొత్త మోడళ్లలో ఈ ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తవుతుండగా.. పాత విమానాలకు హార్డ్వేర్ మార్పులు కూడా అవసరమవుతున్నాయి. ఒక విమానానికి పూర్తిగా అప్డేట్ చేయడానికి రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పట్టవచ్చు. అయినప్పటికీ ఈ చర్య పూర్తిగా భద్రత కోసం తీసుకున్న ముందస్తు రక్షణ చర్య మాత్రమే అని, కోరుకున్న ఫలితాలు పొందిన తర్వాత సేవలు పూర్తిగా సవ్యంగా కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
భారతదేశంలో A320 విమానాల వినియోగం అత్యధిక స్థాయిలో ఉండటంతో ఈ సూచన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండిగో, ఎయిర్ ఇండియా సమూహం కలిపి 350 కంటే ఎక్కువ A320 విమానాలను నడుపుతున్నాయి. ఇండిగో ఇప్పటికే పెద్ద ఎత్తున అప్డేట్లు ప్రారంభించగా, ఎయిర్ ఇండియా కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది. రెండు సంస్థలు ప్రయాణికులకు ప్రయాణానికి ముందు ఫ్లైట్ స్థితిని పరిశీలించాలని సూచించాయి.
సాంకేతిక రక్షణ చర్యల వల్ల తాత్కాలిక అసౌకర్యం ఉన్నప్పటికీ.. భద్రతపైనే ఎయిర్లైన్స్ దృష్టిపెట్టాయని, షెడ్యూల్స్ సాధారణ స్థితికి త్వరలో చేరుతాయని వారు నమ్మకంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6 foa కంటే ఎక్కువ A320 విమానాలు ఈ ప్రక్రియలో పాల్గొంటుండటంతో ఇది ఇంతవరకు అతిపెద్ద సమన్వయ భద్రతా అప్డేట్లలో ఒకటిగా నిలిచింది. ప్రయాణాల భద్రత ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమని, ఈ చర్య దానికో భాగమని విమానయాన నిపుణులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications