ఎయిర్బస్ A320 విమానాలపై తక్షణ భద్రతా తనిఖీలు ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రయాణ షెడ్యూల్పై పెద్దగా ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA), ఎయిర్బస్ సూచనల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్లైన్స్ ఈ సాంకేతిక అప్డేట్ పనులు చేపట్టగా.. కొంతమంది ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. అయితే ఏ ఫ్లైట్ కూడా రద్దు కాలేదని, కేవలం కొన్ని మార్గాల్లో స్వల్ప ఆలస్యాలు ఉండవచ్చని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే తమ A320 విమానాలలో సగానికి పైగా సాఫ్ట్వేర్ రీసెట్ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలిన వాటిని నిర్ణీత సమయానికి చేర్చగలమనే నమ్మకం వ్యక్తం చేసింది.
ఈ అత్యవసర చర్యల వెనుక కారణం ఇటీవల ఒక A320 విమానంలో జరిగిన సంఘటన. ప్రయాణ సమయంలో పైలట్ నియంత్రణ లేకుండానే విమానం ఆకస్మికంగా దిగువకు దూసుకెళ్లిన ఈ ఘటనపై పరిశీలన జరపగా.. ఎలక్ట్రానిక్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (ELAC) పనిచేయకపోవడం ప్రధాన కారణంగా గుర్తించారు. తీవ్రమైన సూర్య వికిరణం ప్రభావం వల్ల విమాన నియంత్రణకు అవసరమైన కీలకమైన డేటా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రిపోర్టుల్లో తేలింది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కమాండ్ లేని లిఫ్ట్ చలనం జరిగి, అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చని EASA హెచ్చరించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ను తప్పనిసరి చేసింది.

కొత్త మోడళ్లలో ఈ ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తవుతుండగా.. పాత విమానాలకు హార్డ్వేర్ మార్పులు కూడా అవసరమవుతున్నాయి. ఒక విమానానికి పూర్తిగా అప్డేట్ చేయడానికి రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పట్టవచ్చు. అయినప్పటికీ ఈ చర్య పూర్తిగా భద్రత కోసం తీసుకున్న ముందస్తు రక్షణ చర్య మాత్రమే అని, కోరుకున్న ఫలితాలు పొందిన తర్వాత సేవలు పూర్తిగా సవ్యంగా కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
భారతదేశంలో A320 విమానాల వినియోగం అత్యధిక స్థాయిలో ఉండటంతో ఈ సూచన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండిగో, ఎయిర్ ఇండియా సమూహం కలిపి 350 కంటే ఎక్కువ A320 విమానాలను నడుపుతున్నాయి. ఇండిగో ఇప్పటికే పెద్ద ఎత్తున అప్డేట్లు ప్రారంభించగా, ఎయిర్ ఇండియా కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది. రెండు సంస్థలు ప్రయాణికులకు ప్రయాణానికి ముందు ఫ్లైట్ స్థితిని పరిశీలించాలని సూచించాయి.
సాంకేతిక రక్షణ చర్యల వల్ల తాత్కాలిక అసౌకర్యం ఉన్నప్పటికీ.. భద్రతపైనే ఎయిర్లైన్స్ దృష్టిపెట్టాయని, షెడ్యూల్స్ సాధారణ స్థితికి త్వరలో చేరుతాయని వారు నమ్మకంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6 foa కంటే ఎక్కువ A320 విమానాలు ఈ ప్రక్రియలో పాల్గొంటుండటంతో ఇది ఇంతవరకు అతిపెద్ద సమన్వయ భద్రతా అప్డేట్లలో ఒకటిగా నిలిచింది. ప్రయాణాల భద్రత ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమని, ఈ చర్య దానికో భాగమని విమానయాన నిపుణులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications