రైల్వే టికెట్ కు సంబంధించి రీఫండ్ కు ప్రయత్నించిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నోయిడాకు చెందిన ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన రైలు 4 గంటలు ఆలస్యమైనందున ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుంచి రీఫండ్ పొందడానికి ప్రయత్నం చేసింది. ఆమె ఐఆర్టీసీ కస్టమర్ కేర్ కు ఫోనే చేశారు. అప్పుడు అవతలి వ్యక్తి ఆమెకు ఒక లింక్ పంపారు. ఈ లింక్పై ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పారు.
ఆమె లింక్పై క్లిక్ చేసిన వెంటనే తన ఫోన్ హ్యాక్ అయిందని మహిళ తెలిపింది. హ్యాకర్ తనను ఆన్లైన్లో ఉండమని చెప్పినట్లు వివరించింది. వన్-టైమ్ పాస్వర్డ్లను (OTPలు) కోరడం లేదని తెలిపినట్ల చెప్పింది. తాను ప్రభుత్వ అధికారినని, ఏదైనా తప్పు చేస్తే ఉద్యోగం పోతుందని మోసగాడు తనతో చెప్పాడని మహిళ పేర్కొంది. దీనిపై ఆమె సైబర్ క్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"నేను అకస్మాత్తుగా చాలా OTPలను స్వీకరించడం ప్రారంభించాను. నేను ఓ యాప్ను అన్ఇన్స్టాల్ చేసాను. దాని గురించి తెలుసుకున్న వెంటనే నా ఖాతాలన్నింటినీ బ్లాక్ చేసాను" అని బాధితురాలు తెలిపింది. అయినా డబ్బు పోయిందన్నారు. హ్యాకర్ తన నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యాడని, తనను తాను చెల్లింపుదారుగా చేర్చుకున్నాడని చెప్పింది. తర్వాత రూ. 3 లక్షల విలువైన రుణం తీసుకున్నాడని బాధిత మహిళ తెలిపింది. తన క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.2 లక్షలు డెబిట్ చేశాడని ఆమె పేర్కొంది.
ఈ విషయమై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. IRCTC ఎప్పుడూ ఏ కస్టమర్ నుంచి వ్యక్తిగత వివరాలను కోరదని తెలిపింది. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. "సర్, IRCTC దాని ఉద్యోగులు ఎప్పుడూ స్త్రీల నుంచి వ్యక్తిగత వివరాలను అడగరు. కొంతమంది మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తమ ప్రశ్నను లేవనెత్తిన IRCTC వినియోగదారుని లక్ష్యంగా చేసుకున్నారు. IRCTCలో రీఫండ్ ప్రక్రియ పూర్తిగా స్వయంచాలకంగా ఉంటుందని" అని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications